breaking news
BESCOM
-
కరెంట్ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్ జరిగేది ఇదే: విద్యుత్ శాఖ వార్నింగ్!
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. అయితే మే 20న ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ‘సూత్రప్రాయంగా అంగీకరించినా’ దీనిపై తుది ప్రకటనతో విధివిధానాలను తెలపాల్సి ఉంది. అయితే ఈ హామీలు బెస్కాంను ఇబ్బందుల్లోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. చర్యలు తప్పవ్ త్వరలో ఉచిత విద్యుత్ పథకం ప్రకటన వస్తుందని ఆశిస్తున్న ప్రజలు వారి విద్యుత్ బిల్లులను చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక మరో వైపు వినియోగదారులు బిల్లులు చెల్లించక మధ్యలో బెస్కామ్ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్) నలిగిపోతోంది. దీంతో ఈ విషయంపై బెస్కామ్ సీరియస్గా తీసుకుంది. ప్రజలు తమ బిల్లులను వెంటనే చెల్లించాలని లేదా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గత వారంలో, చాలా మంది వినియోగదారులు బెస్కామ్ను సంప్రదించి దీని గురించి ఆరా తీశారు. ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారిలో చాలా మంది ఇప్పుడు మొదటి 200 యూనిట్లను క్యాష్బ్యాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్ణీత గడువులోగా వినియోగదారులు వారి బిల్లులు తప్పక చెల్లించాలని బెస్కామ్ అధికారులు వినియోగదారులకు సూచించారు. భారం ఎంతంటే.. రాష్ట్రంలో దాదాపు 2.1 కోట్ల మంది గృహ వినియోగదారులు ఉన్నారు, వీరిలో 1.26 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన (BPL) కుటుంబాలు ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించే పథకం ద్వారా రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.3,509 కోట్లు, ఏటా రూ.42,108 కోట్ల భారం పడనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సహా ఐదు వాగ్దానాలపై తొలి కేబినెట్ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘అవి అంగీకరించాం.. హామీలపై వెనక్కి వెళ్లబోమని చెప్పారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
నెట్టింట్లో బిల్లు కట్టొచ్చు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరానికి మాత్రమే ఇప్పటి వరకు పరిమితమై ఉన్న ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవలు మరో ఏడు జిల్లాలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ జిల్లాలన్నీ బెస్కాం (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ) పరిధిలో ఉన్నాయి. ఏడాది కిందట ప్రారంభమైన ఈ ఆన్లైన్ చెల్లింపు సేవలు నగరంలో 47 డివిజన్ల పరిధిలోని 45 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. మంగళవారం నుంచి బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిక్కబళ్లాపురం, రామనగర, దావణగెరె, చిత్రదుర్గ, కోలారు జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. తద్వారా 40 లక్షల మంది వినియోగదారులు ఇకమీదట ఆన్లైన్లో బిల్లులను చెల్లించవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు కలిగిన వినియోగదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. చెల్లింపు ఇలా.. బెస్కాం పరిధిలోని వినియోగదారులు జ్ట్టిఞ://ఛ్ఛటఛిౌఝ.ౌటజ వెబ్సైట్ను సందర్శించాలి. అందులో ఆన్లైన్లో బిల్లు చెల్లింపు లింకును క్లిక్ చేయాలి. బెంగళూరుతో పాటు మరో 24 నగరాలు, పట్టణాల వినియోగదారులకు ఓ లింకు, గ్రామీణ వినియోగదారులకు మరో లింకు ఉంటుంది. వినియోగదారులు తమకు చెందిన డివిజన్ను గుర్తించి క్లిక్ చేయాలి. అనంతరం స్క్రీన్పై కనిపించే చెల్లింపు బటన్ను నొక్కి, ఇతర లాంఛనాలను పూర్తి చేయాలి. ఆన్లైన్ ద్వారా చెల్లింపు వల్ల సమయం ఆదా కావడమే కాకుండా, చాంతాడంతా క్యూలో నిల్చునే బాధ తప్పుతుంది. ఎక్కడి నుంచైనా ఈ చెల్లింపులను పూర్తి చేయవచ్చు. గ్రామాల్లో ఇళ్ల వద్దే బిల్లు వసూలు గ్రామాల్లో ఇళ్ల వద్దే విద్యుత్ బిల్లులను చెల్లించే సదుపాయం మరో కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మీటర్ రీడింగ్ను చూసి అప్పటికప్పుడే బిల్లును ఇచ్చే ఉపకరణాల ద్వారానే ఆ బిల్లు మొత్తాన్ని అక్కడికక్కడే వసూలు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఉపకరణాలకు సాఫ్ట్వేర్ను అమర్చే పనులను చేపట్టారు. తద్వారా ఇంటి వద్దే బిల్లు మొత్తం వసూలు చేసుకుని వినియోగదారునికి రసీదు ఇస్తారు. డబ్బులు చెల్లించిన వెంటనే బెస్కాం సర్వర్లో ఈ లావాదేవీ నమోదమవుతుంది. కోలారు జిల్లా బంగారుపేటలో ఈ నెల ఒకటో తేది నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పద్ధతిని రెండు నెలల పాటు అమలు చేస్తారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని 16 మంది బిల్ కలెక్టర్లు రోజూ సగటున 200 మంది వినియోగదారుల నుంచి చెల్లింపులను స్వీకరిస్తున్నారు.