breaking news
Berlin Film Festival
-
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కు అల్లు అర్జున్
జర్మనీ వెళ్లారు హీరో అల్లు అర్జున్. ఈ ఏడాది ఫిబ్రవరి 15 (గురువారం) నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంటారు అల్లు అర్జున్. ఈ చిత్రోత్సవాల్లో భారతీయ సినిమాప్రాముఖ్యత, చరిత్ర గురించిన అంశాలను అల్లు అర్జున్ మాట్లాడనున్నారని తెలిసింది. అంతేకాదు...ఈ ఫెస్టివల్లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొం దుతున్న ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ప్రత్యేక ప్రదర్శన కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్, మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్లతో అల్లు అర్జున్ మాట్లాడతారట. ఇక బెర్లిన్ ఫెస్టివల్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో పాల్గొంటారు అల్లు అర్జున్. రష్మికా మందన్నా, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
నగేశ్ కుకునూర్ సినిమాలో...
ఆశా సైనీ గుర్తుంది కదూ? ‘నరసింహనాయుడు’లో బాలకృష్ణతో ‘లక్స్ పాప’గా నర్తించి బాగా పాపులరయ్యారు. ఇప్పుడామె తన పేరుని ఫ్లోరా సైనీగా మార్చుకున్నారు. హిందీ చిత్రసీమలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ‘ధనక్’ (అంటే ఇంద్రధనస్సు అని అర్థం) అనే సినిమాలో కీలక పాత్ర చేశారామె. ఎనిమిదేళ్ల అంధ బాలుడు పదో ఏట అడుగుపెట్టేసరికి, అతని పదకొండేళ్ల అక్క కంటి చూపు తెప్పిస్తానని ప్రమాణం చేస్తుంది. దానికోసం తన స్నేహితులతో కలిసి ఆ సోదరి చేసిన ప్రయత్నాల సమాహారంతో ఈ చిత్రం సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం బెర్లిన్ చలన చిత్రోత్సవాలకు ఎంపికైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవాల్లో ‘ధనక్’ ప్రదర్శితం కానుంది.