-
మార్కెట్లోకి ‘ట్రెండ్ ఈ’ ఎలక్ట్రిక్ స్కూటర్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అవన్ మోటార్స్.. ‘ట్రెండ్ ఈ’ పేరుతో నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ.56,900 కాగా, డబుల్ బ్యాటరీ స్కూటర్ ధర రూ.81,269. రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జయ్యే విధమైన లిథియం–అయాన్ బ్యాటరీని ఈ స్కూటర్లలో అమర్చినట్లు తెలిపింది. సింగిల్ బ్యాటరీ స్కూటర్ గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, డబుల్ బ్యాటరీ స్కూటర్ 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని సంస్థ ప్రకటించింది. రూ.1,100 చెల్లించి స్కూటర్ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ప్రీ–బుకింగ్స్ సమయంలో ఈ స్కూటర్స్కు విశేష స్పందన మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్ ఫీచర్లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు. -
250 కోట్ల విద్యారుణాల లక్ష్యం: అవాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అనుబంధ కంపెనీ ‘అవాన్స్’ విద్యారుణాలపై మరింత దృష్టిసారించనున్నట్లు తెలిపింది. ఐదేళ్లలో రూ.5,000 కోట్ల విద్యారుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అవాన్స్ పేర్కొంది. గడిచిన ఏడాది రూ. 50 కోట్ల విలువైన రుణాలను ఇచ్చామని, ఈ ఏడాది రూ. 250కోట్లు ఇవ్వనున్నట్లు అవాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ సక్సేనా తెలిపారు.. హైదరాబాద్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీరజ్ మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి దేశీయ విద్యా రుణాల విలువ 30 శాతం చొప్పున వృద్ధి చెందుతూ, ప్రస్తుతం రూ.80,000 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఏటా 24 లక్షల మంది విద్యార్థులు చేరుతుండటంతో రాష్ట్రమార్కెట్పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యారుణాల మార్కెట్ రూ.6,000 కోట్లుగా ఉన్నట్లు అంచనా. విద్యారుణాలకే కాకుండా స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు, వాటికి కావల్సిన ముడిసరుకు సరఫరాలకు సంబంధించిన విభాగాల్లో కూడా రుణాలకు మంచి డిమాండ్ ఉందని, వచ్చే నెల నుంచి వీటికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత విద్యారుణాలకే ఎక్కువ ప్రాధానత్యను ఇస్తున్నామని చెప్పారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోస్టల్ బ్యాలెట్కు నేడు చివరి అవకాశం
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్కు!
వదిలేశారు!
బీజేపీ గెలిస్తే.. నియంత పాలనే! : సీఎం రేవంత్రెడ్డి
‘పథకాలు అమలు కావాలంటే మళ్లీ జగనే రావాలి’
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు
రెండో పెళ్లికి సిద్ధపడిన కొడుకు!
No Headline
వైఎస్సార్ సీపీ వెంటే కాళింగ సామాజికవర్గం
ఆస్తులు ఇచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబు
తప్పక చదవండి
- నన్ను నమ్మండీ! నేను ఇది వరకులా కాను!!
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement