breaking news
article 370 D
-
ఒమర్, ముఫ్తీలను వీడనున్న చెర..
శ్రీనగర్ : స్టేట్ గెస్ట్ హౌస్లో గృహ నిర్బంధంలో ఉన్న జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను వారి ఇళ్లకు తరలించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్ 5న మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దును ప్రకటించినప్పటి నుంచి వీరిని స్టేట్ గెస్ట్హౌస్లో గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా ఈ వారాంతంలో ఇరువురు నేతలను వారి ఇళ్లకు తరలించే ప్రక్రియ చేపట్టవచ్చని భావిస్తున్నారు. అయితే వీరిని ఇంకా హౌస్ అరెస్ట్లో ఉంచుతారా లేక విడుదల చేస్తారా అనేది అధికారులు ధ్రువీకరించలేదు. మరోవైపు ఎమ్మెల్యే హాస్టల్ నుంచి నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలు సజద్ లోన్, వహీద్ పరాలను బుధవారం విడుదల చేశారు. వీరితో పాటు సీనియర్ ఎన్సీ నేత అలి మహ్మద్, పీడీపీ నేత సర్తాజ్ మద్నీలను ఎమ్మెల్యే హాస్టల్ నుంచి మరో ప్రాంతానికి తరలించారు. అధికారుల నిర్బంధంలోకి వెళ్లిన తర్వాత తొలిసారిగా జనవరి 25న బహిర్గతమైన ఒమర్ అబ్దుల్లా తెల్లని గడ్డంతో ఉన్న తొలి ఫోటో ఆయనను గుర్తు పట్టలేనంతగా ఉండటంతో నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చదవండి : ఈ మాజీ సీఎం ఎవరో గుర్తుపట్టారా? -
ఆర్టికల్ 370 రద్దు; ఆయన కల నెరవేరింది!
ఎన్నో ఏళ్ల ఉత్కంఠ, ఊహాగానాలకు తెరదించుతూ ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అదే విధంగా జమ్ము కశ్మీర్ను పునర్ విభజన చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో ఆయన ప్రసంగం ముగిసిన వెనువెంటనే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన, వివాదాస్పదమైన, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ రద్దు చేయబడింది. ఈ నేపథ్యంలో కశ్మీర్పై పూర్తి హక్కులు కేంద్రానికి సంక్రమించబడ్డాయి. దీంతో దేశ వ్యాప్తంగా అమలు చేసే అన్ని పార్లమెంటు చట్టాలు కశ్మీర్ లోయలోనూ అమలుకానున్నాయి. 2014లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు.. ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో అంతకుమించిన ఆధిక్యం సొంతం చేసుకుని వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టికల్ 370ను రద్దు చేస్తామంటూ అప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అనేకమార్లు ప్రకటించారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నరేంద్ర మోదీ సర్కారు ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ విపక్షాలు వాకౌట్ చేయగా... కొన్ని పార్టీలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ వ్యూహాలతో బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిరకాల కోరికను నెరవేర్చారంటూ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒకే దేశం రెండు రాజ్యాంగాలు ఎందుకు? భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆది నుంచి కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని విమర్శించేవారు. భారత్లో అంతర్భాగమైన కశ్మీర్లో అడుగుపెట్టాలంటే ఎవరో ఒకరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ నెహ్రూ సర్కారును ప్రశ్నించేవారు. ప్రత్యేక హక్కులు కల్పిస్తూ.. జమ్మూ కశ్మీర్ను భారత కూటమిలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి...‘ ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు’(ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చెలేంగే) అంటూ నినాదాలతో జనసంఘ్ నిరసన వ్యక్తం చేసింది. అదే విధంగా ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా గవర్నర్ల స్థానంలో సర్దార్-ఏ-రియాసత్’ , ముఖ్యమంత్రి స్థానంలో ప్రధాని ఉండటంలో అర్థమేమిటి అని నెహ్రూ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తరచుగా ప్రశ్నించేవారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953, మే11న ఆ రాష్ట్రంలో ప్రవేశించారు. జాతీయవాదాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో...కశ్మీర్ను పూర్తిగా భారత్లో విలీనం చేయాలనే డిమాండ్తో ఎటువంటి అనుమతి లేకుండా అక్కడికి వెళ్లిన ముఖర్జీని కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అదే ఏడాది జూన్ 23న కస్టడీలోనే ఆయన కన్నుమూశారు. కాగా ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ కల నెరవేరినట్లయిందని బీజేపీ శ్రేణులు ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇకపై కశ్మీర్ ప్రజలు కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల్లాగే భారత పౌరులుగా గుర్తించబడతారని వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. అసలు ఊహించి ఉంటామా? ఇక ఆర్టికల్ రద్దు విషయమై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన అనంతరం బీజేపీ నేత రామ్ మాధవ్, పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ కశ్మీర్ను పూర్తిగా భారత్లో విలీనం చేయాలంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదలు ఎంతో మంది చేసిన బలిదానాలకు, ఏడు దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కింది. అసలు మన జీవితకాలంలో ఇది ఊహించి ఉంటామా? ఇదొక గొప్పనైన రోజు’ అంటూ రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. ఇక షానవాజ్ హుస్సేన్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు తెలిపారు. -
మండలిలో 371 ‘ఢీ’
అది రాజ్యాంగ విరుద్ధమన్న చెంగ ల్రాయుడు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: విద్యా ఉపాధి అవకాశాలకు గండికొట్టే ఆర్టికల్ 371డీ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలు మండలిలో వాగ్వాదానికి తెరతీశారుు. అదే పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి, యాదవరెడ్డిలు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 371డీ రాజ్యాంగ విరుద్ధం అనే హక్కు చెంగల్రాయుడికి లేదని, ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పొంగులేటి, యాదవరెడ్డిలు కూడా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుపట్టారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ 371డీపై సభ్యులు అభిప్రాయాలు చెప్పవచ్చుగానీ, నిర్ణయాలు చెప్పే అధికారం వారికి లేదని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే విషయంలో పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తమ ఉద్యమమని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి అన్నారు. టీడీపీ విభజనకు కట్టుబడి ఉందని, 2008లోనే చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆ పార్టీ ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ తెలిపారు. లోపల అంతా విభజనకు ఒప్పుకుని బయట ఉల్టాగా మాట్లాడుతున్నారని, అందులో మా సీఎం కూడా ఒకరని షబ్బీర్ అలీ విమర్శించారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని తోసిరాజని విభజన జరిగితే అది అప్రజాస్వామ్యమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు విభజన ప్రక్రియ జరుగుతుండటాన్ని బట్టి.. ఇది రాజకీయ లబ్ధి కోసమేనని అర్థమవుతోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. కేవలం అభివృద్ధి కోసమే ప్రత్యేక తెలంగాణ అడగడం లేదని, ఇది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి చెప్పారు. రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. {పాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బి.వెంకట్రావ్ కోరారు.