breaking news
Advertisement network
-
ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ను వెంటనే నిలిపేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వారం రోజులపాటు లీగ్ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి మ్యాచ్లకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ 2025ను నిలిపివేయడం ప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లలో ఆందోళనలకు కారణమవుతుంది. ప్రకటనల ఆదాయంలో 35% తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. లీగ్ వాయిదా పడడం వల్ల మార్కెటింగ్ ప్రణాళికలకు అంతరాయం కలిగినట్లు తెలియజేస్తున్నారు.బ్రాడ్కాస్టర్లు, బ్రాండింగ్ కంపెనీల ఆందోళనభారతదేశంలో అత్యంత లాభదాయకమైన క్రీడా ఈవెంట్లలో ఐపీఎల్ ఒకటి. ఇది మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షిస్తోంది. భారీ ప్రకటనల ఆదాయాన్ని సృష్టిస్తోంది. మార్కెటింగ్ కీలకంగా మారిన ఈ లీగ్ పునఃప్రారంభించకపోతే జియోహాట్స్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు రూ.2,000 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. చాలా బ్రాండ్లు ఐపీఎల్ వాణిజ్య ప్రకటనల కోసం గణనీయంగా బడ్జెట్ కేటాయించాయి. అధిక వ్యూయర్షిప్ ద్వారా రాబడిని పెంచాలని నిర్ణయించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారు తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని నివారించడానికి కొత్త వ్యూహాలతో ముందుకుసాగాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.జట్లు, ఫ్రాంచైజీలపై ప్రభావంప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లకు మించి ఈ వాయిదా నిర్ణయం నేరుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ప్రభావం చూపుతుంది. సెంట్రల్ రెవెన్యూ పూల్పై ఆధారపడే జట్లు తమ సంపాదనలో 20% క్షీణతను చూడవచ్చని కొందరు అంటున్నారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో అనిశ్చితి కారణంగా అనేక ఫ్రాంచైజీలు స్పాన్సర్షిప్లను, టిక్కెట్ల అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇండియా-యూఎస్ వయా యూరప్భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లీగ్ నిలిపివేతకు జాతీయ ప్రయోజనాలే కారణమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పేర్కొంది. తొలుత వారం రోజుల విరామం ప్రకటించినప్పటికీ, అప్పటివరకు యుద్ధం సమసిపోనట్లయితే ఇది మరింతకాలం పోడిగించే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం అయితే లీగ్ను రద్దు చేసుకోవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. -
అమగి మీడియా ల్యాబ్స్లో ప్రేమ్జీ పెట్టుబడి
బెంగళూరు: అడ్వర్టయిజ్మెంట్ నెట్వర్క్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమగి మీడియా ల్యాబ్స్లో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ పెట్టుబడి పెట్టారు. ఆయన సొంత ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థ ప్రేమ్జీ ఇన్వెస్ట్ ద్వారా ఈ నిధులను వెచ్చించినట్లు అమగి మీడియా ల్యాబ్స్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తమ సంస్థలో సంస్థాగత ఇన్వెస్టర్గా ఉన్న మేఫీల్డ్ ఫండ్ కూడా తాజాగా మరోవిడత ఇన్వెస్ట్చేసినట్లు తెలిపింది. అయితే, పెట్టుబడుల వివరాలు తెలియలేదు. మరిన్ని కొత్త చానళ్లను జత చేసుకోవడంతోపాటు జియో-టార్గెటింగ్ నెట్వర్క్ విస్తరణ, బ్రిటన్, సింగపూర్, అమెరికాల్లో కార్యాలయాల ఏర్పాటుకు తాజా పెట్టుబడులను వినియోగిస్తామని అమగి సహ-వ్యవస్థాపకుడు భాస్కర్ సుబ్రమణియన్ తెలిపారు. 2008-09లో అమగి... నాదత్తూర్ ఇన్వెస్ట్మెంట్స్, మేఫీల్డ్ల నుంచి 1.2 కోట్ల డాలర్లను సమీకరించింది. నిర్ధిష్ట ప్రాంతాలు, మార్కెట్లలో వివిధ కార్పొరేట్ బ్రాండ్ల యాడ్లు వచ్చే విధంగా అమగి నెట్వర్క్ ప్లాట్ఫామ్ సేవలందిస్తుంది.