-
ఆ ప్లేయర్ ఎంట్రీ ఖాయమేనా?.. రెండో టెస్టుకు భారత్ తుది జట్టు!
మరికొద్ది గంటల్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న రోహిత్ సేన సిరీస్ క్లీన్స్వీప్పై కన్నేసింది. తొలి టెస్టులో కనీసం రెండు వందల పరుగుల మార్క్ను అందుకోవడంలో విఫలమైన విండీస్ కనీసం ఈసారైనా తన స్కోరును 200 దాటిస్తుందేమో చూడాలి. ఓపెనర్గా యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. తాను ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసి ఎవరికి సాధ్యం కాని రికార్డులను అందుకున్నాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే రెండో టెస్టులో టీమ్ ఎలా ఉండబోతోంది? మరో ప్లేయర్ అరంగేట్రం ఖాయమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో యశస్వికి అవకాశం ఇచ్చినట్లే.. ఈ రెండో టెస్టులో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిగతా జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. గురువారం (జులై 20) నుంచి వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. శార్దూల్ బ్యాట్ తోనూ రాణించే ప్లేయరే అయినా.. ఇప్పటికే జట్టులో జడేజా, అశ్విన్ లాంటి ఆల్ రౌండర్లు ఉండటంతో అతని స్థానంలో ముకేశ్ ను తీసుకునే స్వేచ్ఛ కెప్టెన్ రోహిత్ కు ఉంది. ఇక వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ నే కొనసాగించనున్నారు. తొలి టెస్టుతోనే ఇషాన్ తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో బ్యాట్ తో తనను తాను నిరూపించుకునే అవకాశం అతనికి రాలేదు. అంతేకాదు మూడోస్థానంలో వచ్చిన శుభ్మన్ గిల్, చాలా రోజుల తర్వాత ఇండియన్ టీమ్ లోకి వచ్చిన అజింక్య రహానే కూడా విఫలమయ్యారు. వీళ్లు రెండో టెస్టులో రాణించాల్సి ఉంది. పేస్ బౌలింగ్ లో సిరాజ్, జైదేవ్ ఉనద్కట్ తుది జట్టులో కొనసాగనున్నారు. టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్/ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్ చదవండి: పాక్ ఘన విజయం; లంక గడ్డపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..! -
ఇంతకంటే దిగజారడం ఉండదు: విండీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు
ICC Cricket World Cup Qualifiers 2023: ‘‘చాలా కాలంగా జట్టు వైఫల్యం కొనసాగుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్లో సూపర్ 12 స్టేజ్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడిలా! పరిమిత ఓవర్ల క్రికెట్లో రోజురోజుకీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇక ఇంతకంటే దిగజారడం ఇంకేమీ ఉండదేమో’’ అని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షాయీ హోప్ బృందం కనీసం వన్డే వరల్డ్కప్-2023 ప్రధాన పోటీకి అర్హత సాధించని నేపథ్యంలో జట్టు ఆట తీరును విమర్శించాడు. కాగా జింబాబ్వే వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో విండీస్ దారుణ వైఫల్యాలు మూటగట్టుకుంది. గ్రూప్ స్టేజిలో జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఇక సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఏవైనా అద్భుతాలు జరగాలని కోరుకోవడమే తప్ప విండీస్ చేతిలో ఇంకేమీ మిగల్లేదు. రెండుసార్లు చాంపియన్గా నిలిచిన కరేబియన్ జట్టుకు ఈ దుస్థితి పట్టడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్లోస్ బ్రాత్వైట్ ఐసీసీ షోలో మాట్లాడుతూ.. షాయీ హోప్ బృందంపై విమర్శలు గుప్పించాడు. ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇక విండీస్ లెజండరీ పేసర్ ఇయాన్ బిషప్.. ‘‘మేటి జట్లపై మేము మెరుగ్గా ఆడి.. నిలకడైన ప్రదర్శన కనబరిచి దశాబ్దానికి పైగానే అయింది. కరేబియన్ జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఒకరో ఇద్దరో పోరాడితే సరిపోదు. అంతా కలిసి కట్టుగా ముందుకు రావాల్సి ఉంది’’ అంటూ విండీస్ క్రికెట్ బోర్డులో కుమ్ములాటలు, మ్యాచ్ ఫీజులపై పేచీలు తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావించాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి సొంతగడ్డపై టీమిండియాతో విండీస్ టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. చదవండి: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే? ఆరోజు నాకు అన్యాయం చేసి ధోనికి అవార్డు ఇచ్చారు! ఎందుకంత ఏడుపు.. -
Trending Pic: విండీస్ యోధుడి ముఖం చినబోయిన వేళ..!
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 26) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్పై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓడిన విండీస్ సూపర్ సిక్స్కు చేరినప్పటికీ.. వరల్డ్కప్-2023కు అర్హత సాధించే అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. సూపర్ సిక్స్లో విండీస్ ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో గెలిచినా వరల్డ్కప్కు అర్హత సాధించడ కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జింబాబ్వే, శ్రీలంకలకు వరల్డ్కప్ బెర్త్ దొరకడం ఖాయమని తెలుస్తుంది. కాగా, నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం యావత్ వెస్టిండీస్ బృందంలో బాధ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్లో కోచ్ కార్ల్ హూపర్తో పాటు ఆటగాళ్లంతా దాదాపుగా కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించిన మాకు ఇదేం గతి అన్నట్లు వారు వ్యవహరించారు. వీరందరి బాధ కంటే ఓ విండీస్ యోధుడి ముఖంలో కనిపించిన నిరాశ, నిర్వేదం చూపరులకు చాలా బాధ కలిగించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రజంటేషన్ సందర్భంగా విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్వైట్ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్.. యావత్ విండీస్ అభిమానుల బాధను ప్రతిబింబించింది. లోగాన్ వాన్ బీక్కు అవార్డు బహుకరిస్తున్న సమయంలో బ్రాత్వైట్ ముఖం చాలా చిన్నబోయినట్లు కనిపించింది. అతని ముఖం విండీస్ ఓటమి తాలూక బాధ కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. ఈ పిక్ చూసి క్రికెట్ అభిమానులు విండీస్పై జాలి చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించిన జట్టుకు ఈ దుస్థితి ఏంటని బాధపడుతున్నారు. కాగా, కార్లోస్ బ్రాత్వైట్ 2016లో విండీస్ రెండో సారి టీ20 వరల్డ్కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో బ్రాత్వైట్.. బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది విండీస్ను జగజ్జేతగా నిలబెట్టాడు. -
ILT20 2023: ఐఎల్ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్ జట్టు.. అంబరాన్నంటిన సంబరాలు
International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) మొదటి ఎడిషన్ విజేతగా గల్ఫ్ జెయింట్స్ అవతరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్ వైపర్స్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. నెల రోజుల పాటు సాగిన టోర్నీ ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్ క్యాపిటల్స్- అబుదాబి నైట్ రైడర్స్ మ్యాచ్తో జనవరి 13న ఐఎల్టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, డెజర్ట్ వైపర్స్ సహా గల్ఫ్ జెయింట్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్ వైపర్స్- గల్ఫ్ జెయింట్స్ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన గల్ఫ్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బ్రాత్వైట్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ పతనాన్ని శాసించాడు. ఇతరులలో గ్రాండ్హోం ఒకటి, కైస్ అహ్మద్ రెండు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్ క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు. క్రిస్ లిన్ అద్భుత ఇన్నింగ్స్ ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్మెయిర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్ జెయింట్స్ టార్గెట్ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్ వైపర్స్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్టీ20 మొదటి చాంపియన్గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్ జెయింట్స్ అదానీ స్పోర్ట్స్లైన్కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఐఎల్టీ20 ఫైనల్: డెజర్ట్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు డెజర్ట్ వైపర్స్- 146/8 (20) గల్ఫ్ జెయింట్స్- 149/3 (18.4) చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ Ind Vs Pak: ప్రపంచకప్లో పాక్పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు 🎶 BRING IT ON! 🎶 Strength, challenge, & victory! Our anthem tells you all you need to know about us!🤩#GiantArmy, presenting to you the Gulf Giants anthem, written & performed by @salim_merchant @Sulaiman 💪#ALeagueApart #DPWorldILT20 #BringItOn @ilt20official @ilt20onzee pic.twitter.com/jJJbUHBxq6 — Gulf Giants 🦅 (@GulfGiants) January 15, 2023 -
'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్
'చేసిన పాపం ఊరికే పోదంటారు'' పెద్దలు. తాజాగా విండీస్ స్టార్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్వైట్ విషయంలో అదే జరిగింది. త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్వైట్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. విటాలిటీ టి20 బ్లాస్ట్లో భాగంగా వార్విక్షైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. డెర్బీషైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ బ్రాత్వైట్ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్ మాడ్సన్ ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని బ్రాత్వైట్ యార్కర్ వేయగా.. మాడ్సన్ బంతిని ముందుకు పుష్ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్వైట్ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్ పాదానికి గట్టిగా తగిలింది. నాన్స్ట్రైకర్ కాల్ ఇవ్వడంతో సింగిల్ పూర్తి చేశారు. బ్రాత్వైట్ కూడా మాడ్సన్ను క్షమాపణ కోరాడు. ఇక్కడితో దీనికి ఫుల్స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ఇదంతా గమనించిన ఫీల్డ్ అంపైర్ బ్రాత్వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్ అంపైర్తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్బాల్గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్రాత్వైట్ అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నట్లు.. ఆ ఓవర్లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెర్బీషైర్ వార్విక్షైర్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Not ideal for Carlos Brathwaite 😬 A 5-run penalty was given against the Bears after this incident...#Blast22 pic.twitter.com/pXZLGcEGYa — Vitality Blast (@VitalityBlast) June 19, 2022 చదవండి: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్తో పాటు నా పేరు కూడా: యశస్వి Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement