చక్రవాకం సీరియల్తో ఇంద్రనీల్, మేఘన తెలుగు బుల్లితెర ఆడియన్స్కు దగ్గరయ్యారు.
పెళ్లయి 20 ఏళ్లవుతున్నా వీరికి సంతానం లేదు.
దీనికి గల కారణాన్ని ఈ జంట తాజాగా వెల్లడించింది.
మేఘన మాట్లాడుతూ.. '2005లో మేము పెళ్లి చేసుకున్నాం.
నాకు రెండుసార్లు గర్భస్రావమైంది.
అందులో ఒకటి డైరెక్టర్ మిస్టేక్ వల్లే అయింది.
ప్రెగ్నెన్సీతోనే షూటింగ్కు వెళ్లాను.
అప్పుడు నాకు రెండో నెల అనుకుంటా! డైరెక్టర్ దాదాపు 40 సార్లు నన్ను మెట్లెక్కించాడు.
వద్దు సర్ అని చెప్తున్నా వినిపించుకోలేదు.
కాసేపటికి నావల్ల కాక కూర్చున్నాను.
నాకు రక్తస్రావమైంది.
ఈ గర్భస్రావం వల్ల ఆరేళ్లపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయా.
బాధతో ఇండస్ట్రీని మానేశాను.
ఆ సమయంలోనే లావయ్యాను.


