ఇప్పటికీ సొంతంగా తనకంటూ ఓ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)ను రూపొందించుకోనందుకు చైనా ఈర్ష్య పడుతూ ఉండవచ్చు. గత 15 ఏళ్లుగా దేశీయ ఓఎస్ను రూపొందించుకునేందుకు చైనా నానా తంటాలు పడుతూనే ఉంది. ఓఎస్ టెక్నాలజీ విషయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, ఆ ప్రయత్నం ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. కానీ, భారత్ మాత్రం రెండేళ్ల కిందటే ఆ ఘనతను సొంతం చేసుకుంది.
ఇండస్ ఓఎస్.. ఇప్పుడు భారత్లో మొబైల్ ఫోన్లు అత్యధికంగా వాడుకుంటున్న మొబైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్లలో రెండోస్థానంలో ఉంది. ఆల్ఫాబెట్ అండ్రాయిడ్ తర్వాత 6.3శాతం మార్కెట్ వాటాతో రెండోస్థానంలో ఇండస్ ఓఎస్ ఉంది. స్థానిక భారతీయ భాషలలో రూపొందిన ఈ ఓఎస్ 2015 సంవత్సరం ముగిసేనాటికి రెండోస్థానాన్ని ఆక్రమించి.. ప్రస్తుత సంవత్సరంలోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ వారమే విడుదలైన కౌంటర్ పాయింట రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఐవోఎస్తోపాటు షియోమి, ఎంఐయూఐ, సియానోజెన్ వంటి ఆండ్రాయిడ్ వెరియంట్లు కూడా ఇండస్ ఓఎస్ను వాడుతున్నాయి.
చైనా సొంతంగా ఓఎస్ రూపొందించుకునే క్రమంలో చైనా ఓఎస్ (సీఓఎస్), కిలిన్, రెడ్ ఫ్లాగ్, యున్ఓఎస్ వంటి ప్రయోగాలు చేసినప్పటికీ అవి అంతగా విజయవంతం కాలేదు. చైనా ప్రభుత్వం, పలు ప్రైవేటు కంపెనీలు ఈ విషయంలో ప్రోత్సాహం అందించినా అనుకున్న లక్ష్యాన్ని అది సాధించలేదు.
వాస్తవంగా ఫస్ట్టచ్ పేరిట రూపొందించిన ఇండస్ ఓస్ 2015లో సంచలనం సృష్టించింది. ఈ ఓఎస్ను వాడుకోవడానికి మైక్రోమాక్స్ కంపెనీ ముందుకురావడం దీనికి పెద్ద ఊతంగా నిలిచింది. స్థానిక డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఓఎస్ రూపొందడంతో ఇది బాగా ఆదరణ పొందింది. టైపింగ్ సౌలభ్యకరంగా ఉండటం, టైపింగ్లో ప్రాంతీయ భాషల పదాల ప్రిడిక్షన్ సరిగ్గా ఉండటం ఈ ఓఎస్ కు కలిసివొచ్చే అంశం. ఇది ఓఎస్ విషయంలో ఐఫోన్ ఆపరేటింట్ సిస్టమ్ అయిన ఐఓఎస్ను దేశీయంగా అధిగమించింది. యాప్ బజార్ వంటి యాప్లతో మరిన్ని ఆర్థిక సేవలు అందించేందుకు ఈ ఓఎస్ సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ’మేకిన్ ఇండియా’కు ఈ ఓఎస్ రూపకల్పన పెద్ద ఊతమిచ్చే అంశమని నిపుణులు చెప్తున్నారు.
చైనా సాధించలేనిది.. భారత్ సాధించింది!
Published Wed, Aug 31 2016 4:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement