రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!


హైదరాబాద్: రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని ఏ1 ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి కేసు విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ కేసును వేగవంతం చేయాలని సుధాకర్రెడ్డి... ప్రభుత్వానికి సూచించారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జోక్యం చేసుకోవాలని పొంగులేటి కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top