బంగారంలాంటి భూములు లాక్కునేందుకే... | modi governement trying to accupy formers land: sonia gandhi | Sakshi
Sakshi News home page

బంగారంలాంటి భూములు లాక్కునేందుకే...

Apr 19 2015 1:28 PM | Updated on Mar 18 2019 9:02 PM

బంగారంలాంటి భూములు లాక్కునేందుకే... - Sakshi

బంగారంలాంటి భూములు లాక్కునేందుకే...

బంగారంలాంటి పంటలు లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు.

న్యూఢిల్లీ: బంగారంలాంటి పంటలు లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. ఆదివారం రైతులకోసం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ ర్యాలీలో పాల్గొన్న సోనియా మాట్లాడుతూ బడ్జెట్లో రైతుల సంక్షేమానికి కేటాయింపులు తగ్గాయని చెప్పారు. ఓ పథకం ప్రకారమే మోదీ సర్కార్ భూ సేకరణ చట్టంలో మార్పులు తెస్తున్నారని, రైతుల భూములు లాక్కోవాలన్నదే బీజేపీ మోదీ ప్లాన్ అని ఆరోపించారు.

కార్పొరేట్ సంస్థలకు మేలు చేయాలన్నదే మోదీ ప్రధాని ఉద్దేశమనిఆమె చెప్పారు. 14 పార్టీలతో కలిసి తాము ఈ విషయంలో రాష్ట్రపతిని కలిశామని చెప్పారు. మోదీ చెప్పే మాట ఒకటి.. మనసులో ఉన్నది మరొకటి అని తెలిపారు. కిసాన్ ర్యాలీతో రైతుల ఆగ్రహాన్ని మోదీ దృష్టికి తీసుకొచ్చామని సోనియా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement