మెదక్ డీఈవో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసింది.
హైదరాబాద్: మెదక్ డీఈవో ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ మెదక్ డీఈవో ఏ రాజేశ్వరరావుపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ వేటు వేసింది.
ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆయన స్థానంలో మెదక్ డీఈవోగా నజీముద్దీన్ ను నియమించగా, ఖమ్మం డీఈవోగా ఎన్ రాజేశ్ ను నియమించారు.