బార్ ఓపెన్ చేసిన మంత్రులు!
మహారాష్ట్ర మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు చెడ్డపేరు తీసుకొచ్చారు.
ముంబయి: మహారాష్ట్ర మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు చెడ్డపేరు తీసుకొచ్చారు. ఆయన కేబినెట్లో బాధ్యతలు నిర్వహిస్తూ అహ్మద్ నగర్లో ఓ బారు షాపును ఓపెన్ చేశారు. దీంతో అది ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు తావునిచ్చింది. హోంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న రామ్ షిండే, ఆర్థిక శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న దీపక్ కేసర్కార్ అహ్మద్ నగర్లో ఓ బారు షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేశారు.
గతంలో తమ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మధ్య పాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని, దఫాలవారిగా ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమని కేబినెట్ సమేతంగా ఫడ్నవీస్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మంత్రులు చేసిన చర్యలు పలు విమర్శలకు తావిచ్చింది.


