పాఠశాలల్లో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం మేలుకుంది.
బెంగళూరు: పాఠశాలల్లో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం మేలుకుంది. చిన్నారుల భద్రత కోసం 14 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది.
కేంబ్రిడ్జి స్కూల్లో ఇటీవల ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. అంతకుముందు రెండు ప్రైవేటు పాఠశాలల్లో ఇలాంటి దారుణాలు వెలుగుచూశాయి. చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోవడంతో బెంగళూరు వాసుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పసిమొగ్గలపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేశారు. ప్రజాగ్రహంతో దిగివచ్చిన ప్రభుత్వం- చిన్నారుల భద్రత కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది.