పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు | former mla balaraju slams tdp leaders over land grabbings | Sakshi
Sakshi News home page

పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు

Oct 10 2015 3:20 PM | Updated on Mar 23 2019 9:10 PM

పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు - Sakshi

పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు

టీడీపీ నాయకులు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని, ఇసుక, మట్టి, చివరకు భూములు కూడా దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లాం బాలరాజు మండిపడ్డారు.

టీడీపీ నాయకులు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని, ఇసుక, మట్టి, చివరకు భూములు కూడా దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లాం బాలరాజు మండిపడ్డారు. ఈ రాజ్యంలో ఏదీ ఉంచేలా లేరని ఆయన విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • నాలుగు రోజుల నుంచి ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
  • మీ అందరి తరఫున జగనన్నకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకొంటున్నా.
  • ఈ దీక్షతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్ అంటే చంద్రబాబుకు దడ.
  • ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తుంటే ఎలా అడ్డంకులు కల్పిస్తున్నారో, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారో మీరంతా చూస్తున్నారు.
  • అయినా వాటిని జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు
  • పోలవరం ప్రాజెక్టు దివంగత రాజశేఖర రెడ్డి కల
  • ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు శాశ్వతంగా పోతుంది
  • ప్రత్యేక హోదా గురించి అందరూ ఇంతలా ఘోష పెడుతుంటే చంద్రబాబుకు వినిపించడం లేదు, కనిపించడం లేదు.
  • ఆయన ధ్యాసంతా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అన్నదే.
  • ఆయనకు ఎంతసేపూ చైనా, జపాన్ లాంటి దేశాలు తిరగడానికి తీరిక ఉంటుంది తప్ప ప్రజాసేవకు తీరిక లేదు.
  • ఈ 18 నెలల్లో ఆయన కల్లిబొల్లి మాటలతో దోపిడి రాజ్యం నడిపిస్తున్నాడు.
  • ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఎలా ఎడారి అయ్యిందో చూస్తున్నాం
  • పంటలు పండట్లేదు, ఏ రైతూ సుఖంగా లేరు
  • చంద్రబాబు పాలనలో విద్యార్థులు, రైతులు, ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు
  • ప్రజలే ఆయనను తిప్పికొడతారు.. ఇది ఖాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement