తెలంగాణ అసెంబ్లీ సీట్లు పెంచాలి: మర్రి | Assembly seats should be increased in telangana says Marri Shashidhar Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సీట్లు పెంచాలి: మర్రి

Nov 21 2013 2:53 AM | Updated on Sep 2 2017 12:48 AM

తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కొత్తరాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి కోరారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కొత్తరాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సారథి సుశీల్ కుమార్ షిండేకి ఆయన బుధవారం లేఖ రాశారు. తెలంగాణ పరిధిలో 17 లోక్‌సభ సీట్లు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని రాజకీయ అస్థిరతకు ఆస్కారం లేకుండా సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో రెండేసి చొప్పున అదనంగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేయాలని, దీనితో సీట్ల సంఖ్య 153కు పెరుగుతుందని తన లేఖలో తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement