సాక్షి, న్యూఢిల్లీ: తన స్థాయి, మూలాలు మరచి సీఎం కిరణ్ కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా ధిక్కారం వినిపిస్తున్నారని డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నర్సింహ మండిపడ్డారు. ఇందుకు సీఎంపై సరైన చర్యలుంటాయని విశ్వసిస్తున్నామన్నారు. ఢిల్లీలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ప్రాం తానికి సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్కు నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీఎంను అడగడానికి వెళ్లిన మంత్రులు గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, డీకే అరుణ సహా తెలంగాణ మంత్రులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం తమ ప్రాంత ప్రజలను, ప్రజాప్రతినిధులను అవమానించడమేనని ధ్వజమెత్తారు.
సీఎం ఆదేశాల మేరకే ఆడపడుచులైన మంత్రుల పట్ల ఢిల్లీ పోలీసులు ఇలా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు, కిరణ్, జగన్లా మోసం చేయకుండా తెలంగాణ బిల్లుకు సహకరించాలని బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. కుట్రలు, కుతంత్రాలకు కిరణ్ పర్యాయపదం అన్నారు. తెలంగాణపై ఇచ్చినమాట నిలబెట్టుకున్న సోనియాకు రుణపడి ఉంటామన్నారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చేసిన తీర్మానం, సీడబ్ల్యూసీ నిర్ణయం వచ్చాక కొత్త రాజధానికి ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అడిగిన విషయాన్నీ గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో బీజేపీని కలసి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ విలీనం విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న గీతారెడ్డి..
పోలీసుల చర్యలను మీడియా సమావేశంలో వివరిస్తూ మంత్రి గీతారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. కిరణ్ను రాష్ట్రానికి సీఎంగా సోనియా నియమిస్తే ఆయన సీమాంధ్ర కోసమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కోసమే సీఎం అయితే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానన్న కిరణ్ ఇప్పుడు ధిక్కరిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు అంజన్ కుమార్, గుత్తా సుఖేందర్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, వీహెచ్, రాజయ్య, మంత్రి పొన్నాల, చీఫ్విప్ గండ్ర తదితరులు పాల్గొన్నారు.
స్థాయి మరచి ధిక్కారమా?: దామోదర్ రాజనర్సింహ
Published Thu, Feb 6 2014 2:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement