'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా | Andamans boat tragedy: PM announces relief | Sakshi
Sakshi News home page

'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా

Jan 28 2014 3:31 PM | Updated on Sep 17 2018 7:44 PM

'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా - Sakshi

'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్గ్రేషియా

అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన ఒక్కొకుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు చెప్పారు. పడవ దుర్ఘటన పట్ల ఆయన తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్లో మంగళవారం ఆ విషయాన్ని పోస్ట్ చేసింది.

 

అండమాన్ నికోబార్ దీవులోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఆదివారం 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తిరగబడింది. ఆ ఘటనలో 31 మంది మరణించిన సంగతి తెలిసిందే. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఆ  ఘటనలో ఒక వ్యక్తి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. మృతులలో తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు.  జయలలిత ఇప్పటికే మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement