పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు

పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు - Sakshi


జకర్తా: ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో పడవను నౌక ఢీకొట్టిన ఘటనలో కనీసం 15 మంది గల్లంతయ్యారు. శనివారం తుర్బాన్ జిల్లా జలాల్లో వియత్నాం నౌక, ఇండోనేసియా పడవ ఢీకొన్నాయి. ఇండోనేసియా పడవలో 27 మంది ప్రయాణికులు ఉన్నారు.



ఈ ప్రమాదంలో గల్లంతయిన వారందరూ పడవలో ప్రయాణిస్తున్న వారేనని అధికారులు చెప్పారు. పడవలో ఉన్నవారిలో 12 మందిని సురక్షితంగా కాపాడమని తెలిపారు. మిగిలివారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తూర్పు జావా ప్రావిన్స్ రాజధాని సురబయలోని ఓడరేవుకు వియత్నాం నౌక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top