పదవ తరగతి టాపర్లకు బంపర్ ఆఫర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఓ బంపర్ ఆఫర్ లభించింది. పదవ తరగతి టాపర్లను మంగళవారం అనుకోని అద్భుత అవకాశం వరించింది. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ విద్యార్థులకు విమానంలో విహరిస్తూ హైదరాబాద్ నగర అందాలను తిలకించే అవకాశం కల్పించింది వందేమాతరం ఫౌండేషన్. హైదరాబాద్ బీఎన్రెడ్డి నగర్లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ విమానాల్లో వారు విహరించనున్నారు. తమకు అనుకోని అవకాశం రావడంతో విద్యార్థులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు