మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం నందిగామ శివారులో జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
షాద్నగర్ : మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం నందిగామ శివారులో జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని పక్కరోడ్డులోకి వెళ్లి ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో స్విఫ్ట్ కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా... ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి, ఇన్నోవా కారు డ్రైవర్కు తీవ్ర గాయలయ్యాయి. ఇన్నోవా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.