ఒకే షాపులో రెండు సార్లు దొంగతనం చేసి... పోలీసులకు దొరికిన దొంగ.
ఒకే షాపులో రెండు సార్లు చోరీ చేసిన వ్యక్తి చివరకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల కధనం మేరకు.. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కిరాణా షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం చోరీ విషయాన్ని గమనించిన యజమాని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో తన షాపులో చోరీ చేసిన వ్యక్తే.. ఈ పనికి పాల్పడి ఉంటాడని.. అనుమానించి.. మురుగన్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చోరీ తానే చేశానని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. నిందితుని వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఓ బంగారు ఉంగరం చోరీ చేసినట్లు తెలుస్తోంది.