సెల్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించిన మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది.
సెల్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించిన మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు స్టేషన్ పంచాయతీ పరిధిలోని తూర్పుతండాలో సోమవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు భారతి (35) ఈ రోజు ఉదయం సెల్ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.