ఇంటర్‌లో ఎస్‌ఆర్ విద్యార్థుల ప్రతిభ | sr students got best ranks in intermediate exams | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఎస్‌ఆర్ విద్యార్థుల ప్రతిభ

May 4 2014 12:43 AM | Updated on Sep 2 2017 6:53 AM

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వరంగల్‌లోని ఎస్‌ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు ఆ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, డెరైక్టర్ సంతోష్‌రెడ్డి తెలిపారు.

హన్మకొండ, న్యూస్‌లైన్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వరంగల్‌లోని ఎస్‌ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు ఆ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, డెరైక్టర్ సంతోష్‌రెడ్డి తెలిపారు. ఎంపీసీ విభాగంలో డి.వైష్ణవి, ఎ.శిరీష 987 మార్కులు సాధించారని, బైపీసీలో బి.మధురిమ 983, తంజీల 982 మార్కులు సాధించారని తెలిపారు. ఎంఈసీలో ఎం.సాయిచంద్రిక 965, సీఈసీలో సాదియూ తహసీన్ 942 మార్కులు సాధించారన్నారు.

 

అలాగే, ఎస్‌ఆర్ కాలేజీకి చెందిన కర్నాటి వినోద్‌రెడ్డి జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకుగాను 345 మార్కులు సాధించాడని చైర్మన్ ఎ.వరదారెడ్డి పేర్కొన్నారు. తమ విద్యాసంస్థలకు చెందిన 405మంది జేఈఈకి అర్హత సాధించారని తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement