తండ్రిని హతమార్చిన కుమారులు | Sons killed Father | Sakshi
Sakshi News home page

తండ్రిని హతమార్చిన కుమారులు

Sep 8 2015 4:28 PM | Updated on Jul 30 2018 8:29 PM

తండ్రిని కన్నకొడుకులే హతమార్చారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

శంషాబాద్ (రంగారెడ్డి) : తండ్రిని కన్నకొడుకులే హతమార్చారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గండిగూడలో మహబూబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫయీమ్(55) అనే వ్యక్తి తల్లి, ఇద్దరు కుమారులతో కలసి ఉంటున్నాడు. అయితే నెలరోజుల కిందట ఇద్దరు కుమారులు కలిసి తండ్రిని గొంతు నులిమి హతమార్చరు. అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసి బావిలో పడవేశారు. అయితే ఈ విషయం మంగళవారం బయటపడటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement