వ్యక్తి అనుమానాస్పద మృతి | shankar suspicious death at bamni forest area | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Jul 8 2015 12:47 PM | Updated on Sep 3 2017 5:08 AM

ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం బామ్ని(బి) గ్రామ అటవీ ప్రాంతంలో కదం శంకర్(45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

కుంటాల: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం బామ్ని(బి) గ్రామ అటవీ ప్రాంతంలో కదం శంకర్(45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శంకర్ తిరిగి రాలేదు. అయితే, అటవీ ప్రాంతంలో వెళ్తున్న వాళ్లు ఓ గుర్తుతెలియని మృతదేహం కంటపడటంతో పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement