ఇసుక అక్రమ రవాణా కు అడ్డుకట్ట పడటంలేదు.
50 ఇసుక ట్రాక్టర్ల సీజ్
Jan 23 2016 11:06 AM | Updated on Aug 28 2018 8:41 PM
వేములవాడ రూరల్: ఇసుక అక్రమ రవాణా కు అడ్డుకట్ట పడటంలేదు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం రుద్రారం గ్రామ సమీపంలో నిల్వ చేసిన 50 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు శనివారం తెల్లవారుజామున సీజ్ చేశారు. రుద్రారం వాగు నుంచి అక్రమంగా తోడి తీసుకొచ్చిన ఇసుకను ఇక్కడ నిల్వ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలసి ఆ ఇసుక లోడ్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement