వారంలో రెండు రోజులు ఇక మూతే!
సీఎం వచ్చిన తర్వాత నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలకు విద్యుత్కోత లు రెండు రోజులకు పెరగనున్నాయి. విద్యుత్ డిమాండ్కు, సరఫరాకు మధ్య భారీలోటు ఏర్పడడంతో పరిశ్రమలకు కోతలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, సీఎం కేసీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అధికారికంగా దీనిని ప్రకటించనున్నట్టు తెలిసింది. వ్యవసాయానికి కూడా విద్యుత్కోతలు భారీగా ఉంటున్నాయి. అనేకచోట్ల పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పరిశ్రమలకు కోతలను పెంచి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం పరిశ్రమలకు వారంలో ఒక రోజు కోతలు అమలవుతున్నాయి.
అదేవిధంగా ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైటింగ్కు మాత్రమే విద్యుత్ను ఇస్తున్నారు. రోజురోజుకీ విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. శుక్రవారం నాడు (22వ తేదీ) రాష్ట్రంలో 158 మిలియన్ యూనిట్ల (ఎంయు) డిమాండ్ నమోదు కాగా, సరఫరా 138 ఎంయూలే ఉంది. ఎండలు పెరగడంతో గృహవిద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు వర్షాలు లేకపోవడం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం అమాంతంగా ఎక్కువయింది. దీంతోనే కోత పెంచాల్సి వస్తోందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. గృహాలకు ఇప్పటికే భారీగా కోతలు అమలవుతున్నాయని (హైదరాబాద్-4, జిల్లా కేంద్రాలు-6, మండల కేంద్రాలు-8, గ్రామాల్లో 10-12 గంటల కోత) ఈ వర్గాలు వివరించాయి.
టీ జెన్కోలో సమ్మెలు నిషేధం
సాక్షి, హైదరాబాద్: టీ జెన్కోలో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ అత్యవసర సేవల చట్టం-1971 ప్రకారం సమ్మెల్ని నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ఆర్నెల్లు నిషేధం అమల్లో ఉంటుంది.
పరిశ్రమలకు విద్యుత్ కోత పెంపు
Published Sun, Aug 24 2014 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్
ప్రచార హోరు..
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు చేయాలి
బిల్లులు రాక రెండేళ్లు..
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement