మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. శనివారం రాత్రి నగరంలోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. శనివారం రాత్రి నగరంలోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న 21 మంది మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో 6 కార్లు, 15 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
దూద్బావిలో కార్డెన్ సెర్చ్
దక్షిణ మండల డీసీపీ ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్బావిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 200 మంది పోలీసులు పాల్గొన్న ఈ సెర్చ్లో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 7 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.