నవవధువు ఆత్మాహుతి | Newly married woman commits suicide | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మాహుతి

Sep 11 2015 6:08 PM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లయిన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మాహుతితో తనువు చాలించింది.

నిజాంసాగర్ (నిజామాబాద్) : పెళ్లయిన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మాహుతితో తనువు చాలించింది. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దుంపల హేమలత(22)కు రెండు నెలల క్రితం పిట్లం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది.

అయితే ఇటీవలే పుట్టింటికి వెళ్లిన హేమలత శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement