తాటి, ఈత చెట్లను నరికితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు 

Minister Srinivas Goud Says, Cutting Of Palm Trees Leads To Non Bailable Cases - Sakshi

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికేవారిపై సెక్షన్‌ 27, ఆబ్కారీ చట్టం 1968 ప్రకారం నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశిం చారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు లేఅవుట్ల పేరు తో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చిన వినతులపై ఆయన ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top