రూ.5లక్షల విలువైన గంజాయి పట్టివేత
పాల్వంచ (ఖమ్మం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న రూ.5 లక్షల విలువైన గంజాయిని పాల్వంచలో అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు రావడం గమనించిన ముగ్గురు నిందితులు పరారయ్యారు. ఓ టాటా సుమోను సీజ్ చేసి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు