నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు భారీ ముడుపులు ఇవ్వజూపుతూ ఏసీబీకి పట్టుబడ్డ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా చేర్చాల్సిందేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు భారీ ముడుపులు ఇవ్వజూపుతూ ఏసీబీకి పట్టుబడ్డ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా చేర్చాల్సిందేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆశ్రయమిచ్చినట్లు ప్రభాకర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రారంభించిందే చంద్రబాబేనన్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారి అయితే సూత్రధారి మాత్రం చంద్రబాబేనని విమర్శించారు.