రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ 'C' ప్రశ్నాపత్రాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఎంపిక చేశారు.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ 'C' ప్రశ్నాపత్రాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఎంపిక చేశారు. 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,251 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 9,73,237 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు.
అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,66,448 మంది, ద్వితీయ సంవత్సరం వారు 5,06,789 మంది. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. 040-24601010 నంబర్కు కాల్ చేయడంతో పాటు 040-24655027 నంబర్కు ఫ్యాక్స్ చేయవచ్చు. మొత్తం పరీక్షా కేంద్రాల్లో 502 ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 749 కేంద్రాలు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. మరో 37 సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.