ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు | Intermediate examinations begin | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Mar 9 2015 9:00 AM | Updated on Sep 2 2017 10:33 PM

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ 'C' ప్రశ్నాపత్రాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఎంపిక చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ 'C' ప్రశ్నాపత్రాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఎంపిక చేశారు. 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,251 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 9,73,237 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు.

అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,66,448 మంది, ద్వితీయ సంవత్సరం వారు 5,06,789 మంది. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. 040-24601010 నంబర్‌కు కాల్ చేయడంతో పాటు 040-24655027 నంబర్‌కు ఫ్యాక్స్ చేయవచ్చు. మొత్తం పరీక్షా కేంద్రాల్లో 502 ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 749 కేంద్రాలు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. మరో 37 సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement