ఎడతెరిపిలేని వాన
- తూర్పున కుండపోత
- అత్యధికంగా మంథనిలో 19, రామగుండంలో 15.2 సెంటీమీటర్ల వర్షం
- సగటున 4.6 సెంటీమీటర్లు
- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
- కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
- 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
కరీంనగర్ అగ్రికల్చర్ : రాయికల్ నుంచి కోరుట్లకు వెళ్లే మైతాపూర్ గ్రామ శివారులో ఉన్న రోడ్డ్యాంపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంథని డివిజన్ లో వరద నీటితో వాగులు, వంకలు ఉప్పొంగడంతో 20 గ్రామాలకు రవాణా స్తంభించింది. మంథనిలోని పద్మశాలి వీధిలో ఇళ్లలోకి నీరు చేరింది. బొగ్గులవాగు, బొక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంటపొలాలు నీట మునిగాయి. ప్రమాదపుటంచున చెరువులు ఉన్నా యి. మహాముత్తారం మండలంలోని లోతట్టు గ్రామాలైన కనుకునూర్, రెడ్డిపల్లి గ్రామాలు రెండురోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
కాటారం మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చిద్నెపల్లివద్ద గల చిద్నెపల్లి వాగు, పోతులవాయి వద్ద గల బొర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు నాలుగుగంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. యైటింక్లయిన్కాలనీలో ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టులో ఆదివారం 250 హెచ్పీ పంపు, డ్రిల్యంత్రం నీటిలో మునిగిపోయాయి. మహదేవ్పూర్, కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం 10.550 అడుగుల వద్ద ఉంది. అది పెరిగే అవకాశముంది.
ఈ సీజన్ ఇదే అధికం
జిల్లా అంతటా ముసురుకున్న వానతో చెరువులు, కుంటలు జలసిరి సంతరించుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాకాలం మొదలై నాలుగు నెలలు కాగా ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఈ సీజన్లో ఇప్పటిరకు 712.7మిల్లీమీటర్లకుగాను 508.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటికీ 29 శాతం లోటు వర్షపాతమే ఉంది. 11 మండలాలు సాధారణ వర్షపాతానికి చేరుకోగా.. 46 మండలాల్లో లోటు వర్షం ఉంది. జిల్లాలో రెండు రోజుల నుంచి అత్యధికంగా మంథని, పెద్దపల్లి డివిజన్లో భారీవర్షాలు కురిశాయి.
అత్యధికంగా మంథనిలో 19.0, రామగుండంలో 15.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మంథని డివిజన్లో సగటున 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై సాధారణ వర్షపాతానికి చేరుకుంది. పెద్దపల్లి డివిజన్లో సగటున 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల డివిజన్లో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కరీంనగర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని 11 మండలాలు(మహదేవపూర్, మంథని, కమాన్పూర్, కాటారం, జూలపల్లి, పెద్దపల్లి, మెట్పల్లి, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, చొప్పదండి, హుస్నాబాద్) సాధారణ వర్షపాతానికి చేరున్నాయి.
‘ముసురు’కుంది
Published Mon, Sep 8 2014 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement