మహబూబ్నగర్ అర్బన్: గత 29 రోజులుగా ఉపవాసాలు చేసిన ముస్లింలు రంజాన్ ముగింపు సందర్భంగా మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)పండుగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా వేకువజాము నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాలు తదితర ప్రార్థనస్థలాల వద్దకు చేరుకొని ప్రత్యేకప్రార్థనలు చేశారు. కొత్త వస్త్రాలు ధరించిన ముస్లింలు ప్రత్యేక పండుగ నమాజ్ను చదివి సర్వమానవాళి క్షేమం కోరుతూ అల్లాహ్ను వేడుకున్నారు. హిందూ, ముస్లింలు పరస్పరం రంజాన్ పండుగ శుభాకాంక్షలు చె ప్పుకున్నారు.
ఆర్థికస్తోమత కలిగిన కొందరు ముస్లింలు ఫిత్రా(దానధర్మాలు)చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. దీంతో జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వానగట్టు వద్దనున్న ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
రంజాన్ పవిత్రమాసం అనంతరం మంగళవారం ఈద్ఉల్ ఫితర్ను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్గౌడ్, మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్రావుఆర్యా, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్.రవికుమార్, వివిధ పార్టీల నేతలు సత్తూరు రాములుగౌడ్, ఎన్పీ వెంకటేశ్, బెనహర్, డీఎస్పీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు..
రంజాన్ను పురస్కరించుకుని జిల్లా కేం ద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రా మాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీసులు పహరా కాశారు. పోలీసులు, ఆ శాఖ అధికారులు కూడా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ ముబారక్
Published Wed, Jul 30 2014 3:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement