చంపేందుకు కుట్ర జరుగుతోందని డీఎస్‌ తనయుడు ఫిర్యాదు! | Former PCC chairman DS son given complaint on at Banjarahills police station | Sakshi
Sakshi News home page

చంపేందుకు కుట్ర జరుగుతోందని డీఎస్‌ తనయుడు ఫిర్యాదు!

Jul 29 2014 7:26 PM | Updated on Sep 2 2017 11:04 AM

తనను చంపేందుకు కొందరు వెంబడిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్‌ ఆరోపించారు.

హైదరాబాద్: తనను చంపేందుకు కొందరు వెంబడిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్‌ ఆరోపించారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సంజయ్ మంగళవారం మధ్యాహ్నం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సంజయ్ ఫిర్యాదు చేశారు. 
 
గతంలో నిజామాబాద్ మేయర్ గా సంజయ్ సేవలందించారు. వ్యక్తిగతంగా తనకెవరితో విబేధాలు లేవని సంజయ్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. సంజయ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా అనుమానిత వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి కేంద్రికరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement