సింగరేణి క్వారీలో భారీ అగ్నిప్రమాదం

 రూ. 20 లక్షల ఆస్తి నష్టం

సాక్షి, రామగుండం: కరీంనగర్‌ జిల్లా రామగుండం సింగరేణి డివిజన్‌-3 పరిధిలోని ఓపీసీ-1 క్వారీలో అగ్నిప్రమాదం సంభవిచింది. శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి హైడ్రాలిక్‌ షావెల​ కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. షావెల్‌ ఇంజన్‌ ​ఆపరేటర్‌ భోజనానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top