అప్పులే కాల్చేశాయి.. | farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులే కాల్చేశాయి..

Sep 24 2015 10:25 AM | Updated on Nov 6 2018 7:56 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన నీలి రాములు(27)అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల భారం ఓ రైతును నిలువెల్లా  దహించింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన నీలి రాములు(27)కు రెండెకరాల పొలం ఉంది. అందులో ఏటా పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడు పత్తి ఆశాజనకంగా లేకపోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీనికి తోడు రూ.లక్ష వరకు అప్పు ఉంది. ఈ నేపథ్యంలో అతడు గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలోనే కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు.  అతనిని ఎవరూ గమనించక పోవటంతో తీవ్ర గాయాలతో చనిపోయాడు. రాములుకు భార్య మంజుల, మూడేళ్ల కుమారుడు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement