మహబూబ్నగర్ వ్యవసాయం:
అధిక పంటదిగుబడులు సాధిం చడంతో పాటు నీరు, కరెంట్ను ఆదా చేసి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న డ్రిప్ పరికరాలు గద్వాల కేంద్రంగా సరిహద్దు దాటుతున్నాయి. ఆయా కంపెనీల డీలర్లు, ఉద్యోగులు, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో పక్కరాష్ట్రాలకు తరలుతున్నాయి. దీంతో ఏటా రూ.ఐదుకోట్ల మేర రాయితీ సొమ్ముకు గండిపడుతోంది. ఈ వ్యవహారమంతా జిల్లా మై క్రోఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
దందా ఇలా..
100 శాతం, 90శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్న డ్రిప్ పరికరాలను కొన్నిచోట్ల రైతుల నుండి డీలర్లు, మధ్యవర్తులు తక్కువధరలకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు అ మ్ముతున్నారు. రాయలసీమ ప్రాంతంలో వీటికి బాగా డిమాండ్ ఉంది.
కొన్నిచోట్ల రైతుల నుండి డీలర్లు దరఖాస్తులను తీసుకుని మైక్రోఇరిగేషన్ అధికారులతో మంజూరు చేయించుకుంటున్నారు. వాటిని రైతులకు తెలియకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైతులు ప్రశ్నిస్తే అప్పుడు ఇప్పుడు ఇస్తామని తిప్పుకుంటున్నారు.
మరికొన్నిచోట్ల పాత దరఖాస్తులు లేవని రైతులకు చెప్పి.. కొత్తగా దరఖాస్తులు చేయిస్తున్నారు. ఇలా మంజూరైన పరికరాలను రైతులకు దక్కకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఒకసారి డ్రిప్లు పొందిన రైతులు పదేళ్లలోపు దరఖాస్తు చేసుకోకూడదు. కానీ ఇలాంటి దరఖాస్తులే ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏటా అధికభాగం గద్వాల డివిజన్ పరిధిలో ఉన్న మండలాలకు పరికరాాలను కేటాయిస్తారు.
గద్వాల, మల్దకల్ మీదుగా వీటిని కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల నుండి శ్రీశైలం మీదుగా గుంటూరు, రాయలసీమ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు.
అక్రమాలు వెలుగులోకి..
నాలుగునెలల క్రితం కోస్గి మండలంలో ఓ కంపెనీ ఉద్యోగి, డీలర్ కలిసి రైతులకు ఇచ్చిన డ్రిప్లను తిరిగి తీసుకుని ఓ లారీలో తరలిస్తుండగా స్థానికులు మైక్రోఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదుచేయగా చర్యలకు ఉపక్రమించారు. సీఎం కేసీఆర్కు స్వయంగా ఫిర్యాదుచేశారు. స్పందించిన ముఖ్యమంత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించారు.
ఈ విషయమై రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ పీఓ వెంకటరమణరెడ్డి డ్రిప్ కంపెనీల కోఆర్డినేటర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా జరిగితే కఠినచర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. కాగా, కోస్గి వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఎంఐపీ సిబ్బంది, కంపెనీల ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. విజిలెన్స్ విచారణ చేపట్టకముందే అంతర్గత విచారణ పేరుతో ఎంఐపీ అధికారులు విచారణ చేపట్టి ఏమీ తేల్చలేకపోయారు.
20 బండిళ్ల డ్రిప్పైపుల పట్టివేత
గద్వాలటౌన్: గద్వాల పట్టణ శివారులో నిల్వఉంచిన 20 బెండళ్ల రాయితీ డ్రిప్ పైపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైక్రో ఇరిగేషన్ స్టేట్ ప్రాజెక్టు పీడీ విద్యాశంకర్, ఏపీడీ సురేష్ ఆదేశాల మేరకు బుధవారం ఆ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈద్గా సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రాయితీడ్రిప్ పైపులను అధికారులు గుర్తించారు.
ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన రాయితీ డ్రిప్ పైపులుగా స్థానిక అధికారులు శివకుమార్, జనార్ధన్లు గుర్తించారు. టౌన్ ఏఎస్సై సూర్యప్రకాష్, సిబ్బంది డ్రిప్ పైపులను పరిశీలించారు. ఈ పైపులపై ప్రభుత్వం విడుదల చేసిన ఎంబోజింగ్ ఉందని అధికారులు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు పెద్ద మొత్తంలో రాయితీపై డ్రిప్ పైపులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. అక్రమంగా నిల్వ ఉంచిన డ్రిప్ పైపులను పరిశీలించడానికి గురువారం జిల్లా కేంద్రం నుంచి అధికారులు వస్తున్నారని తెలిపారు. దీనిపై టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
డ్రిప్.. దందా
Published Thu, Oct 30 2014 4:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement