దళితుల రాస్తారోకో | dalits agitate over regularisation of lands | Sakshi
Sakshi News home page

దళితుల రాస్తారోకో

Jan 26 2015 1:37 PM | Updated on Jul 24 2018 2:22 PM

కరీంనగర్ జిల్లా సుల్తానాబజార్లో ఇళ్ల పట్టాల కోసం దళితులు సోమవారం రాస్తారోకోకు దిగారు.

కరీంనగర్ జిల్లా సుల్తానాబజార్లో ఇళ్ల పట్టాల కోసం దళితులు సోమవారం రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాల్లో 125 చదరపు గజాల కన్నా కాస్త ఎక్కువగా ఉన్న స్థలాన్ని కూడా దళితులకు  క్రమబద్ధీకరించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జీఓ నంబరు 59 మేరకు క్రమబద్ధీకరించి ఆ స్థలంలో వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలని వారు అభ్యర్థించారు. రాస్తారోకో తర్వాత మండల తహశీల్దారుకు క్రమబద్ధీకరణ గురించి వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement