ఎముకల ఫ్యాక్టరీని మూసివేయాలి | Close the bone factory | Sakshi
Sakshi News home page

ఎముకల ఫ్యాక్టరీని మూసివేయాలి

May 8 2018 10:30 AM | Updated on May 29 2018 4:40 PM

Close the bone factory - Sakshi

జేసీకి వినతిపత్రం అందజేస్తున్ననాయకులు  

అనంతగిరి : పూడూరు మండలం మేడికొండ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఎముకల ఫ్యాక్టరీని మూసివేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అద్యక్షుడు కోళ్ల యాదయ్య, టీజేఎస్‌ జిల్లా నాయకుడు నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం  జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు హానీ చేసే ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలని కోరారు.

ఎముకల ఫ్యాక్టరీతో  ప్రజలు తీవ్ర ఆనారోగ్యనికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన దుర్వాసనతో అస్వస్థతకు గురై పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గతంలో ఈ ఫ్యాక్టరీపై అధికారులు చర్యలు తీసుకుని మూసివేసిన తర్వాత తిరిగి నడుస్తుందని మండిపడ్డారు. ఈ విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వసంత్‌కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆనంద్, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement