నగరంలో మరో చిట్టీల మోసం గురువారం వెలుగుచూసింది.
హైదరాబాద్: నగరంలో మరో చిట్టీల మోసం గురువారం వెలుగుచూసింది. కొండాపూర్ లో ఉండే దంపతులు చిట్టీల పేరుతో ఖాతాదారులను నిలువునా ముంచారు. వివరాలు...ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఆయన భార్య ఉష రూ. కోటి తో జనం నెత్తిన టోపీ పెట్టి పరారయ్యారు. మోసం బయటపడటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.