కార్మికుల సీసీఎస్‌కు నిధులు జమ చేసిన ఆర్టీసీ | ccs trabajadores para depositar fondos GeographyHiramandalam | Sakshi
Sakshi News home page

కార్మికుల సీసీఎస్‌కు నిధులు జమ చేసిన ఆర్టీసీ

Sep 28 2014 12:36 AM | Updated on Sep 2 2017 2:01 PM

కార్మికుల పొదుపు సొమ్ము ను మింగేసిన ఆర్టీసీ ఎట్టకేలకు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసింది.

ఎట్టకేలకు సిబ్బందికి రుణాలు
 

హైదరాబాద్: కార్మికుల పొదుపు సొమ్ము ను మింగేసిన ఆర్టీసీ ఎట్టకేలకు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.250 కోట్లు చొప్పున పాత బకాయిలు చెల్లిం చడంతో అందులోంచి రూ.223 కోట్లను కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం జమచేసింది. ఆగస్టు 31 వరకు పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఇవి సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా రూ.53 కోట్లను యాజమాన్యం సీసీఎస్‌కు జమచేయాల్సి ఉంటుంది.

ఆ మొత్తం నుంచి  కుటుంబావసరాలకు కార్మికులు రుణంగా పొందుతారు.  కానీ 5 నెలలుగా వాటి ని జమచేయకుండా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. ఫలితంగా రుణాల కోసం కార్మికులు చేసుకున్న 20 వేల దరఖాస్తులు పేరుకుపోయా యి. ఆగస్టు 31 తర్వాత అందిన దరఖాస్తులు మరో 300 వరకు పెండింగ్‌లో ఉంటాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement