కార్మికుల సీసీఎస్‌కు నిధులు జమ చేసిన ఆర్టీసీ | ccs trabajadores para depositar fondos GeographyHiramandalam | Sakshi
Sakshi News home page

కార్మికుల సీసీఎస్‌కు నిధులు జమ చేసిన ఆర్టీసీ

Sep 28 2014 12:36 AM | Updated on Sep 2 2017 2:01 PM

కార్మికుల పొదుపు సొమ్ము ను మింగేసిన ఆర్టీసీ ఎట్టకేలకు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసింది.

ఎట్టకేలకు సిబ్బందికి రుణాలు
 

హైదరాబాద్: కార్మికుల పొదుపు సొమ్ము ను మింగేసిన ఆర్టీసీ ఎట్టకేలకు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.250 కోట్లు చొప్పున పాత బకాయిలు చెల్లిం చడంతో అందులోంచి రూ.223 కోట్లను కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం జమచేసింది. ఆగస్టు 31 వరకు పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఇవి సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా రూ.53 కోట్లను యాజమాన్యం సీసీఎస్‌కు జమచేయాల్సి ఉంటుంది.

ఆ మొత్తం నుంచి  కుటుంబావసరాలకు కార్మికులు రుణంగా పొందుతారు.  కానీ 5 నెలలుగా వాటి ని జమచేయకుండా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. ఫలితంగా రుణాల కోసం కార్మికులు చేసుకున్న 20 వేల దరఖాస్తులు పేరుకుపోయా యి. ఆగస్టు 31 తర్వాత అందిన దరఖాస్తులు మరో 300 వరకు పెండింగ్‌లో ఉంటాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement