సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో అదనపు డీసీపీ సంజీవకుమార్, రూరల్ ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో సోమవారం వేకువజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక టవేరా వాహనం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లను, మిఠాయి దుకాణంలో కల్తీ ఆయిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.