విద్యార్థిని బలిగొన్న బోరు బండి | a boy dies in accident at warangal disrict | Sakshi
Sakshi News home page

విద్యార్థిని బలిగొన్న బోరు బండి

Jan 27 2015 2:46 AM | Updated on Sep 2 2017 8:18 PM

విద్యార్థిని బలిగొన్న బోరు బండి

విద్యార్థిని బలిగొన్న బోరు బండి

అమ్మా .. జెండా పండుగకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరి న ఓ బాలుడు నిమిషాల వ్యవధిలోనే

గణతంత్ర వేడుకలకు వెళుతుండగా దుర్ఘటన
గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
మల్లంపల్లిలో విషాద ఛాయలు

 
కంచనపల్లి (రఘునాథపల్లి) : అమ్మా .. జెండా పండుగకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరి న ఓ బాలుడు నిమిషాల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరాడు. సైకిల్‌పై పాఠశాలకు వెళుతుండగా బోరు బండి ఢీకొనడంతో తల్లికి పుట్టెడు శోకాన్ని మిగిల్చి అ నంతలోకాలకు చేరాడు. ఈ సంఘటన మండలంలోని కంచనపల్లి సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కంచనపల్లి శివారు మల్లంపల్లికి చెంది న తాళ్లపల్లి ప్రభాకర్, కోమల దంపతుల పెద్ద కుమారుడు వేణు(10) గ్రామంలోని జేసు హృ దయ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చ దువుతున్నాడు.

సోమవారం గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు సైకిల్‌పై అతడు  పాఠశాలకు బయల్దేరాడు. శివాజీనగర్ దాటాక కంచనపల్లి నుంచి కుర్చపల్లి వైపు వెళ్తున్న బోరుబండి అతడి సైకిల్‌ను ఢీకొంది. దీంతో సైకిల్‌పై నుంచి వేణు కిందపడిపోగా బోరుబండి వెనక టైరు అతడి కాలిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయూలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవర్, దానిపై పనిచేసే కార్మికులు బోరుబండిని వదిలేసి పారిపోయా రు. స్థానికులు వచ్చి చూడగా వేణు మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి బోరుబండిని స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
 
పెద్దోన్ని చేస్తాననుకున్న బిడ్డా..


 పైసలు పెట్టి చదివించి పెద్దోన్ని చేయాలకున్నా బిడ్డా... మమ్ములను ఆగం చేసి పోయినవా బిడ్డా అంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. గ్రామస్తులు ఘట నా స్థలికి పెద్దఎత్తున చేరుకుని కన్నీటిపర్యంతమయ్యూరు. పాఠశాలలో వేడుకలను నిలిపివేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement