breaking news
-
తేడా ఎక్కడ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మూడు పార్లమెంటు సెగ్మెంట్లలో విస్తరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ తన రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోగా, కొత్తగా కాంగ్రెస్ పెద్దపల్లి స్థానంలో పాగా వేసింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కీలకమైన కరీంనగర్ సెగ్మెంట్లో ఓటమిపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ తీవ్ర అంతర్మథనంలో పడ్డాయి. ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డపై మూడోస్థానానికి పరిమితవడాన్ని బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేక పోతుండగా, రాష్ట్రమంతా హస్తం హవా వీస్తున్న వేళ.. కరీంనగర్, నిజామాబాద్లలో ఆశించిన ఫలితాలు రానందుకు కాంగ్రెస్ పార్టీ మదనపడుతోంది. తేడా ఎక్కడ జరిగిందన్న విషయంపై ఉమ్మడి జిల్లా నేతలు లెక్కలు వేస్తున్నారు.బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ ఎదురుదాడి..ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు ఉమ్మడి కరీంనగర్ పుట్టినిల్లు. అలాంటి కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అది కూడా మూడోస్థానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనపడిందని పార్లమెంట్ ఫలితాలే చెబుతున్నాయి.. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగుచూడటం ఇరకాటంలో పడేసింది. ఈ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఎదురుదా డిని బీఆర్ఎస్ తిప్పికొట్టలేదన్న విమర్శలున్నాయి.కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ స్థానికేతరుడంటూ బీజేపీ, కాంగ్రెస్ అటాక్ చేశాయి. ఫలితంగా ఒకప్పుడు 2.05 లక్షల మెజారిటీతో గెలిచిన ఆయన ఇప్పుడు కేవలం 2.80 లక్షల ఓట్లకు పరిమితమయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిపిన కారు పార్టీకి ఇక్కడా పరాభవం తప్పలేదు. ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. పార్లమెంట్ పరిధిలో ఎక్కడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.ఇక, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఓడిపోయారు. కోరుట్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఆలస్యమే కారణమా?కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. తన అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ప్రకటించినా ప్రచారంలో దూసుకెళ్లారు. గత ఎన్నికలతో పోల్చినపుడు 1.80 లక్షల ఓట్లు అదనంగా సాధించడమే ఇందుకు నిదర్శనం. ఆయన అభ్యర్థిత్వాన్ని మరికాస్త ముందు ప్రకటిస్తే మరింత మెరుగ్గా రాణించి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 4.75 లక్షల ఓట్లతో సత్తా చాటారు. తాత, తండ్రి తర్వాత మూడో తరం కూడా అదే స్థానం నుంచి గెలిచి, రికార్డు దక్కించుకున్నారు.నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఓటమిపై పార్టీ శ్రేణులు నిరాశ చెందాయి. 4,83,077 ఓట్లు సాధించినా ఆయన విజయానికి లక్షకు పైగా ఓట్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.బీజేపీలో జోష్..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ జోష్ కనిపించింది. సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్లను తిరిగి కైవసం చేసుకుంది. అదే సమయంలో పెద్దపల్లి స్థానంలో గెలిచినంత పని చేసింది. ఈ మూడు స్థానాల్లో బీజేపీ ప్రదర్శనకు కారణం ఎన్నికల సమయంలో మోదీ జగిత్యాల, వేములవాడ సభలే. కేడర్లో జోష్ నింపడంలో బీజేపీ అధిష్టానం సక్సెస్ అయ్యింది.జీవన్రెడ్డి పోటీకి దిగడంతో ఆరంభంలో నిజామాబాద్లో ఆందోళన కనిపించినా.. క్రమంగా సెగ్మెంట్ను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. ఫలితంగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండోసారి విజయం సాధించారు.ఇక, పెద్దపల్లిలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. గోమాసె శ్రీనివాస్ 3.44 లక్షల ఓట్లు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక దశలో గెలుస్తారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్కు ప్రతీ రౌండ్లో గట్టి పోటీ ఇచ్చారు.కరీంనగర్లో బండి సంజయ్ 2.25 లక్షల ఓట్ల మెజారిటీలో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రత్యర్థులిద్దరూ ఓసీలవడం, బీసీల ఓటు బ్యాంకు కలిసి వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.బీఆర్ఎస్ ఓట్లు ఎటు పడ్డట్టు?ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఓట్లు పెరిగి, బీఆర్ఎస్ ఓట్లు అదే స్థాయిలో పడిపోయాయి.బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో ఓటేసిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ పక్షం వహించారని, బీసీలు, అగ్రవర్ణాలు బీజేపీ వైపు మళ్లారని జిల్లా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ఓట్లను పరిశీలించినపుడు బీజేపీ, కాంగ్రెస్లకు ఓట్లు అనూహ్యంగా పెరిగిన విషయం తేటతెల్లమవుతుంది. కారు పార్టీ ఓట్లను ఈ రెండు పార్టీలు పంచుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇవి చదవండి: హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్గొండ: వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్లోనూ లీడ్లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో ఆయనకు 34,575 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో రౌండ్ ఫలితాలుకాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. -
‘వలస’ నేతల్లో ఒక్కరే గెలుపు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీచేసిన ‘వలస’ నేతల్లో ఒకే ఒక్కరే విజయతీరానికి చేరుకుని సత్తా చాటారు. మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీలో చేరి బీజేపీ టికెట్ తెచ్చుకున్నవారు లేదా పార్టీకి ప్రత్యక్షంగా సంబంధం లేని వారు మొత్తంగా 9 మంది పోటీచేశారు. ఈ వలస నేతల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్.. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్ నుంచే గెలుపొందారు. మిగతా ఎనిమిది మంది పరాజయం పాలయ్యారు. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ పి.రాములు (ఆయన తన కుమారుడు భరత్ ప్రసాద్కు టికెట్ ఇప్పించుకున్నారు), మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎంపీ డా.సీతారాంనాయక్, వరంగల్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్, నల్లగొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి కాంగ్రెస్నేత గోమాస శ్రీనివాస్, ఖమ్మం నుంచి సంఘ్పరివార్ క్షేత్రాల్లో పనిచేస్తూ గుర్తింపు పొందిన తాండ్ర వినోద్రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత (సంఘపరివార్తో ఉన్న సంబంధాలు కలిసిరాగా, టికెట్ వచ్చే నాటికి బీజేపీ సభ్యత్వం లేకపోయినా ఆమెకు సీటు) వలసనేతల జాబితా కోవలోకి వస్తారు.గెలిచిన 8 ఎంపీల విషయానికొస్తే...ప్రస్తుతం బీజేపీ గెలిచిన 8 సీట్లలో సిట్టింగ్ ఎంపీలు జి.కిషన్రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్–బీఆర్ఎస్ నుంచి ఎన్నికలకు ముందు బీజేపీలో, చేరారు), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), డీకే అరుణ (మహబూబ్నగర్), ఎం.రఘునందన్రావు (మెదక్), కొండా విశ్వేశ్వర్రెడ్డి (చేవెళ్ల) ఉన్నారు. వీరిలో అర్వింద్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందుగానే బీజేపీలో చేరి ఆ ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ గత లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీ టికెట్పై పోటీచేసినా, ఆమె ఎక్కువకాలం కాంగ్రెస్లో కొనసాగినందున కొత్తగా కమలం గుర్తుతో ఆమెను ఓటర్లు గుర్తించలేదు. దాంతో ఆమె బీజేపీ టికెట్పై మళ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటి తొలిసారి పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన రఘునందన్రావు బీజేపీలో చేరి పదేళ్లకు పైగానే కాగా, 2018–23 మధ్యలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందారు. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటమిపాలయ్యారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు. ఇక కొండా విశ్వేశ్వర్రెడ్డి విషయానికొస్తే...2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. 2019లో చేవెళ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్లీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడి నుంచే ఆ పార్టీ టికెట్పై ఎంపీగా విజయం సాధించారు. టీఆర్ఎస్లో నెంబర్–టుగా ప్రాధాన్యత గల నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యాక బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేగా రాజీనామాతో వచ్చిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. ఐతే 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై మల్కాజిగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే...బీజేపీలోనే పుట్టి పెరిగి ఒరిజనల్, పక్కా కమలనాథులుగా ఉంటూ ఎంపీలుగా గెలిచిన వారు మాత్రం కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమేనని పాతతరం పార్టీ నాయకులు పేర్కొంటుండడం కొసమెరుపు. -
లోక్సభ ఎన్నికల్లో లెక్కలు తారుమారు
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 17 పార్ల మెంటు స్థానాలకు గాను హైదరాబాద్లో ఎంఐఎం విజయం సాధించగా, మిగతా 16 సీట్లను బీజేపీ, కాంగ్రెస్ సమానంగా పంచుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ గెలి చిన 8 పార్లమెంటు స్థానాల్లోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కొన్నిచోట్ల మినహా కాంగ్రెస్సే ఆధిక్యతను కనబరిచింది. కాగా బీజేపీ గెలిచిన 8 లోక్సభ నియోజకవర్గాల్లోని 56 సెగ్మెంట్లలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. మూడు చోట్ల బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. అయి తే చివరికి స్వల్ప తేడాతోనైనా బీజేపీనే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39స్థానాల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక మినహా మిగతా 36 సెగ్మెంట్లలో ఆపార్టీ ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ 2,3 స్థానాలకే పరిమితమైంది. బీఆర్ఎస్కు 2 స్థానాల్లోనే రెండో స్థానం లోక్సభ ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన బీఆర్ఎస్ కేవలం మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తరువాత రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో నాలుగో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ మిగతా 14 చోట్ల మూడో స్థానం దక్కించుకుంది. మెదక్ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాగా, సిద్దిపేట స్థానం మాజీ మంత్రి హరీశ్రావు కంచుకోట. అయితే బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన రఘునందన్ రావు సొంత నియోజకవర్గం అయిన దుబ్బాకలో కూడా బీఆర్ఎస్కే మెజారిటీ రావడం గమనార్హం. బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓటర్ల మొగ్గు బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లలో చాలాచోట్ల కాంగ్రెస్ రెండోస్థానంలో నిలవగా, బీఆర్ఎస్ మూడోస్థానానికి పరిమితమైంది. 2023లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే జాతీయ స్థాయి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ఓటర్లు కూడా ఈసారి బీజేపీ వైపే మొగ్గు చూపారన్న మాట. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ బీజేపీకి మెజారిటీ ఓట్లు రావడం గమనార్హం. కరీంనగర్ లోక్సభ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కరీంనగర్, హుజూరాబాద్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మూడోస్థానంలో నిలిచింది. కరీంనగర్ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ, బీఆర్ఎస్ రెండు, మూడుస్థానాలు దక్కించుకున్నాయి. నిజామాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీ విజయం సాధించగా, ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించిన బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సైతం మూడో స్థానానికే పరిమితమైంది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించగా, 2023 నవంబర్లో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ గెలిచిన 18 సీట్లలోనూ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో బీజేపీకే రెండో స్థానం కాంగ్రెస్ గెలిచిన 8 ఎంపీ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో సీన్ మారింది. బీజేపీ బలం ఏమ్రాతం లేని ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యరి్థగా ఉంది. దాదాపు 50 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండి భారీగా ఓట్లు సాధించడం గమనార్హం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ధర్మపురిలో మాత్రమే కాంగ్రెస్ కన్నా బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధించగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. జహీరాబాద్ ఎంపీ పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, కాంగ్రెస్కు రెండో స్థానం దక్కింది. నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యత సాధించగా, గద్వాలలో మాత్రం కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. ఇక వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పార్లమెంటు స్థానాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలోనే నిలవగా, రెండోస్థానంలో బీజేపీ, మూడోస్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. -
బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 37.5 శాతం ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 16 శాతానికి పడిపోయింది. 22 శాతం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు. 2023 ఎన్నికల్లో 13 శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి ఇప్పుడు 35 శాతం వచ్చాయి. సరిగ్గా బీజేపీకి పెరిగిన ఓట్ల శాతమే బీఆర్ఎస్కు తగ్గింది. కేసీఆర్, హరీశ్, కేటీఆర్లు కలిసి బీఆర్ఎస్ నేతల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. తనంతట తాను అంతర్థానమై బీజేపీని గెలిపించే దురాగతానికి కేసీఆర్ పూనుకున్నాడు..’ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బూడిదైన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు ‘రాష్ట్రంలో కాంగ్రెస్తో పాటు బీజేపీకి కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతలు ఆత్మ బలిదానం చేసుకుని, అవయవ దానం చేశారు. బీజేపీ గెలిచిన 8 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయింది. సిద్దిపేటలో ఎప్పుడూ బీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చేది. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో హరీశ్రావు తన ఓట్లను బీజేపీకి బదిలీ చేశాడు. అక్కడ రఘునందన్రావుకు 63 వేలు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 65 వేలు మాత్రమే వచ్చాయి. కేసీఆర్, హరీశ్లిద్దరూ బీఆర్ఎస్ ఓట్లను పూర్తిగా రఘునందన్ రావుకు బదిలీ చేయించి మెదక్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బలహీన వర్గాల అభ్యర్ధింని ఓడించారు. నమ్మి బీఆర్ఎస్ తరఫున నిలబడిన వెంకట్రామిరెడ్డిని మోసం చేశారు. సిద్దిపేటలో జరిగిన నష్టం కారణంగానే కాంగ్రెస్ మెదక్లో ఓడిపోయింది. మా ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేసీఆర్ నిరంతరం ప్రయతి్నస్తూనే ఉంటాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంత కాలం కుట్రలు కొనసాగుతాయి. ఆయన రాజకీయ జూదగాడు. బూడిద అయిన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు.’ అని రేవంత్రెడ్డి అన్నారు. మాకివి ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు ‘లోక్సభ ఎన్నికల్లో మాకు ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు వచ్చాయి. కొంత తీయగా, కొంత చేదుగా, కొంత పుల్లగా ఉంది. కానీ పచ్చడి మంచిది. ఇప్పుడొచ్చిన ఫలితాలను పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడిలా స్వీకరిస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లతో 65 ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐలు విజయం సాధించాయి. ఇప్పుడు 41 శాతం ఓట్లతో 64 స్థానాల్లో ఆధిక్యతను నిలబెట్టుకోవడంతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ను గెలుచుకున్నాం. అయితే ఫలితాలు మేము, అభిమానులు ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. ఇప్పటివరకు 18 గంటలు పనిచేశాం. ఇంకా రెండు గంటలు అదనంగా పనిచేస్తాం..’ అని సీఎం చెప్పారు. మా పాలనను ప్రజలు సమర్థించారు ‘ఈ ఎన్నికలు మా పాలనకు రిఫరెండం అని చెప్పాం. మా పాలనను మెచ్చుకున్న ప్రజలు ఓట్లు, సీట్లను పెంచి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు. వారి శ్రమ, కష్టం, ప్రయత్నం వల్లనే ఓట్ల శాతం, పార్లమెంటు సీట్లు, ఎమ్మెల్యే స్థానాల్లో మెజార్టీ వచ్చింది. మా గౌరవాన్ని, రాహుల్గాంధీ నాయకత్వాన్ని పార్టీ శ్రేణులు నిలబెట్టాయి. రాహుల్గాంధీ చేపట్టిన దేశవ్యాప్త యాత్రలు, ఇండియా కూటమి ఏర్పాటు, నేతల మధ్య సమన్వయంతో పాటు మోదీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలనా వైఫల్యాలకు దేశ స్థాయిలో ప్రచారం కల్పించడం ద్వారా ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం..’ అని రేవంత్ అన్నారు. గెలుపోటములకు నాదే బాధ్యత ‘మల్కాజిగిరి సిట్టింగ్ ఎంపీ సీటు కోల్పోయినా కంటోన్మెంట్ అసెంబ్లీని గెలుచుకున్నాం. మహబూబ్నగర్లో కూడా ఓడిపోయాం. ఇవన్నీ ప్రజాతీర్పులో భాగం. ప్రజలు ఏ తీర్పునిచ్చినా శిరసావహిస్తాం. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని..జిల్లాకు కాదు. అలాగే పీసీసీ అధ్యక్షుడిని కూడా రాష్ట్రానికే. ఈ రాష్ట్రంలో ఏ సీటు ఓడినా, గెలిచినా నాదే బాధ్యత. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత..’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు ‘2024లో మోదీ గ్యారంటీ అంటూ ఏకవ్యక్తి నాయకత్వంతో ప్రజల దగ్గరికెళితే బీజేపీని దేశ ప్రజలు తిరస్కరించారు. ఆ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని, మోదీకి కాలం చెల్లిందని తీర్పిచ్చారు. ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీని చీల్చడం ద్వారా కుట్రలు, కుతంత్రలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. అక్కడ తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తుందో లేదో చూడాలి. ప్రపంచంలోనే కేసీఆర్ అత్యంత అవినీతిపరుడని, అవినీతి కుటుంబమని ఆరోపణలు చేసిన బీజేపీ వారితోనే ఎలా జట్టు కడుతోందో, ఎలా సమర్ధింస్తోందో ఆ పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలి. మోదీ తక్షణమే ప్రధాని పదవికి రాజీనామా చేసి మళ్లీ ఆ పదవిని చేపట్టకూడదు..’ అని సీఎం అన్నారు. ఏపీతో సమస్యలు చర్చలతో పరిష్కరించుకుంటాం ‘ఏపీ ప్రజల తీర్పును జగన్మోహన్రెడ్డి, చంద్రబాబులు స్వాగతించిన తర్వాత మాదేముంటుంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా స్నేహపూర్వక వాతావరణంలో చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటామని ముందే చెప్పా. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నా. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి కట్టుబడి ఉన్నాం..’ అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, లోక్సభ ఎన్నికల్లో గెలిచిన మల్లురవి, చామల కిరణ్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ది తప్పుడు వ్యూహం: ఒవైసీ
హైదరాబాద్, సాక్షి: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ ఓటమిపై తెలంగాణవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం బీఆర్ఎస్ జీరో ఫలితంపై స్పందించారు. బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ 8 చోట్ల డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణమైంది. బీఆర్ఎస్ ఇలా ఎందుకు చేసిందో నాకైతే తెలియదు. రాజకీయ వ్యూహంలో భాగం అనుకున్నా.. అది తప్పుడు వ్యూహం అని ఒవైసీ అభిప్రాయపడ్డారు. -
బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతల ఆత్మబలిదానం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలిచినవారికి సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లోక్సభ ఫలితాలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ లోక్ ఎన్నికల ఫలితాలు మా 100 రోజుల పాలనకు రెఫరెండం. దేశవ్యాప్తంగా రాహుల్ జోడోయాత్ర పరిస్థితి మారిపోయింది. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుంది. 2019లో 3 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు 8 సీట్లు గెలిచాం. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుండుసున్నా ఇచ్చారు. బీజేపీ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల తీరు మార్చుకోవాలి. మోదీ గ్యారంటీకి ఉన్న వారంటీ ముగిసింది. మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణ లోక్సభ ఫలితాలు ఉగాది పచ్చడిలాగా సగం తియ్యగా, సగం పులుపుగా ఉన్నాయి. మల్కాజిగిరిలో ఓడినా.. కంటోన్మెంట్లో విజయం సాధించాం. కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఎప్పటికప్పుడుతెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని రేవంత్రెడ్డి అన్నారు. -
ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచి..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుడిగా పోటీచేసి ఓటమి చవిచూశాక, మళ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి ఎంపీలుగా గెలిచి సంచలనం సృష్టించిన వారి సంఖ్య ఈ సారి పెరిగింది. తాజాగా ప్రకటించిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ నుంచి ఏకంగా నలుగురు ఎంపీలుగా గెలుపొందారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ల నుంచి పోటీ చేసి ఓడి, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఈటల రాజేందర్, అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్రావు శాసనసభ ఎన్నికల్లో ఓడి మళ్లీ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి విజయం సాధించారు. అదేవిధంగా అప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అరి్వంద్ ఓటమి చెందాక పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సంజయ్, నిజామాబాద్ నుంచి అరి్వంద్ ఎంపీలుగా గెలుపొంది సత్తా చాటారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి ఓడిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి మొదట కేంద్రహోంశాఖ సహాయ మంత్రి, ఆ తర్వాత కేంద్రమంత్రిగా ఆయన ప్రమోషన్ పొందారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి విజయం సాధించారు. ఇదే ఒరవడిలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిన కాంగ్రెస్నేత, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, ఆ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా కొనసాగుతున్న సంగతి విదితమే. -
బీజేపీకి ఎనిమిది సీట్లు ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాలకు పూర్తి భిన్నంగా ఫలితాలు రావడంపై ఆ పార్టీ హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసింది. ఆరు నెలల కిందటే అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మొత్తం 17 సీట్లకు గానూ 14 సీట్లు వస్తాయని భావించినా, కేవలం 8 సీట్లు రావడం, అంతగా క్షేత్రస్థాయి బలం లేని బీజేపీ ఏకంగా 8 స్థానాలను గెలవడం పార్టీ పెద్దలను కలవరానికి గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ ఫలితాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర నేతలతో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సీఎం సొంత జిల్లాలోనూ ఓటమా?తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల్లో కనీసంగా 14 సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించింది. హైకమాండ్ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను రూపొందించుకొని అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం, బూత్, పోల్ మేనేజ్మెంట్ బాధ్యతలకు మంత్రులకు కట్టబెట్టింది. ఇందులో భాగంగా సీఎం స్వయంగా తన సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ ఇంచార్జిగా వ్యవహరించారు. ఆ జిల్లాలోనే పకడ్భందీగా వ్యవహరించినప్పటికీ ఏఐసీసీ కార్యదర్శి, అభ్యర్ధి వంశీచంద్రెడ్డి ఓటమి పాలవ్వడంపై హైకమాండ్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లోక్సభ పరిధిలో ఏడుకు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అభ్యర్ధి ఓడటంపై వారు స్వయంగా ముఖ్యమంత్రినే ఆరా తీసినట్లు తెలసింది.మల్కాజిగిరిలో బీజేపీకి 3లక్షలు మెజారిటీనా?ఇక గతంలో సీఎం రేవంత్ స్వయంగా గెలిచిన మల్కాజ్గిరి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ ఓడటం,, బీజేపీ అభ్యర్ధికి ఏకంగా 3 లక్షల పైచిలుకు మెజార్టీ రావడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఇంతమార్పు ఎందుకు జరిగింది?, పార్టీ నేతల మధ్య సమన్వయం లేదా?,మరే ఇతర కారాణాలున్నాయా? అని ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. చాలామంది రాష్ట్ర నేతలు బీజేపీ గాలి వీచిందని చెప్పగా, అభ్యర్థుల ఎంపికలో తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయని మరికొందమంది చెప్పినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల ఎంపిక పూర్తి ఏకపక్షంగా జరిగిందనే వాదనను కొందరు తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిజల్ట్.. కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్
వరంగల్, ఖమ్మం, నల్లగొంఎ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్ డేట్నల్లగొండపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్ డేట్ఇంకా కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్సాయంత్రం మూడున్నరకు ప్రారంభమైన మొదటి రౌండ్ కౌంటింగ్నాలుగు రౌండ్ల పాటు సాగనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఒక్కో రౌండ్ లో 96 వేల చొప్పున లెక్కింపునల్లగొండప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియమధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసిన బండిల్స్ కట్టె ప్రక్రియమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభంఇంకా కొనసాగుతున్న బెండల్స్ కట్టే ప్రక్రియసాయంత్రం 5 తర్వాతనే ఓట్ల లెక్కింపు ప్రారంభంపట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 4 రౌండ్లలో బ్యాలెట్ ఓట్ల బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తి అయింది ఇంకా మూడు రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మూడు గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందిఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2,100 మంది సిబ్బందిని కేటాయించారు.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. నల్లగొండ జిల్లానేడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుతిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడన్స్ లో లెక్కింపుఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం4 హాల్స్ లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కింపుఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్ధులుమొత్తం ఓటర్లు: 4,63,839పోలైన ఓట్లు: 3,36,013పోలింగ్ శాతం: 72.44రోజుకు మూడు షిఫ్టుల్లో కొనసాగనున్న లెక్కింపుఒక్కో షిఫ్టులో 900 సిబ్బందిమొదటగా బండిల్స్ కట్టే ప్రక్రియఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశంఆతర్వాత చెల్లుబాటు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయనున్న సిబ్బందిచెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు ప్రకటనమొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియఎలిమినేట్ అయిన అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారో చూసి వారికి యాడింగ్అలా కలిపిన తర్వాత యాభై శాతానికి మించి వస్తే గెలిచినట్లు ప్రకటననేడు ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 52 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మూడు విడతల్లో లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఈ ప్ర క్రియ ప్రారంభం అవుతుంది. నా లుగు హాళ్లలో 96 టేబుళ్లపై పోలైన 3,36,013 ఓట్ల లెక్కింపు చేపడతారు. -
హస్తం... పదిలం
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికలు మా పాలనకు రెఫరెండం.. లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. దీనిని సమర్థించుకునేందుకు వీలుగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లే కాంగ్రెస్ సాధించగలిగింది. అయితే రేవంత్ విశ్వాసానికి తగిన స్థాయిలో గెలుపు సాధ్యం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మాత్రం పదిలంగానే ఉన్నాయని లోక్సభ ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ గెలిచిన చోట్ల భారీ మెజార్టీలనే సాధించగలిగింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, పెద్దపల్లిల్లో లక్ష నుంచి ఐదున్నర లక్షల మెజార్టీ సాధించగా, నాగర్కర్నూల్లో లక్షకు దగ్గరగా, జహీరాబాద్లో మాత్రం అత్యల్పంగా 50 వేల లోపు తేడాతో గెలిచింది. ఇక మహబూబ్నగర్, మెదక్లలో స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో అతిపెద్ద మూడో మెజార్టీని నల్లగొండ అభ్యర్థి రఘువీర్రెడ్డి సాధించగా, ఆ స్థానం పరిధిలోనికి వచ్చే హుజూర్నగర్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకంగా 1.05 లక్షల పైచిలుకు మెజార్టీ రావడం గమనార్హం. అక్కడ ఇన్చార్జిగా మంత్రి, సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి వ్యవహరించడం తెలిసిందే.కోటలు బీటలు వారకుండా..అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయానికి ఎక్కడా తీసిపోకుండా లోక్సభ ఎన్నికల్లోనూ విజయతీరాలను చేరడంతో కాంగ్రెస్ పార్టీ కేడర్ ఊపిరి పీల్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన కంచు కోటలకు ఎక్కడా బీటలు వారకుండా లోక్సభ ఎన్నికల్లోనూ ఓట్లను రాబట్టుకోగలిగింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 36 అసెంబ్లీ స్థానాలుండగా, అందులో 34 చోట్ల ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోనికి వచ్చే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ లోక్సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాదాపు అసెంబ్లీలో సాధించిన స్థాయిలోనే ఆయా నియోజకవర్గాల్లో ఓట్లను రాబట్టుకోగలిగింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందగా, ఇప్పుడు కూడా ఆ పార్లమెంటులో మంచి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీతో హోరాహోరీ తలపడిన కాంగ్రెస్ అక్కడ కూడా మంచి విజయాలనే సాధించగలిగింది. నాగర్కర్నూల్లో 94 వేల ఓట్లు, పెద్దపల్లిలో 1.3 లక్షల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని కేవలం ఐదువేల లోపు ఓట్ల తేడాతో కోల్పోయింది.కరీంనగర్లో భారీ తేడాతో ఓటమికరీంనగర్ లోక్సభ స్థానాన్ని మాత్రం భారీ తేడాతో పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన మెదక్ పార్లమెంటు స్థానంలో మాత్రం రెండో స్థానానికి చేరుకోగలిగింది. ఇక్కడ కేవలం 40 వేల ఓట్ల తేడాతో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పరాజయం పాలయ్యారు. మొత్తం మీద మహబూబ్నగర్, మెదక్ స్థానాల్లో గెలుపు అంచుల వద్ద బోల్తా పడ్డామని, లేదంటే తాము ఆశించిన డబుల్ డిజిట్ స్థానాలు వచ్చేవనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.గాంధీభవన్లో సంబురాలురాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆశించిన సీట్లు గెలవడంతో బాణాసంచా మోతసాక్షి, హైదరాబాద్: ఇటు తెలంగాణలో, అటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు గాంధీభవన్లో సంబురాలు చేసుకున్నాయి. తెలంగాణలో 8 ఎంపీ స్థానాల్లో గెలవడం, కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో డప్పులు మోగిస్తూ, బాణాసంచా కాల్చుకుంటూ, స్వీట్లు పంపిణీ చేసి తమ సంతోషాన్ని పంచుకు న్నారు.ఈ సంబురాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎంపీ అనిల్కుమార్యాదవ్, పార్టీ నేతలు హర్కర వేణు గోపాల్, ఫహీం ఖురేషీ, రోహిణ్రెడ్డి, మెట్టుసాయి కుమార్, సంగిశెట్టి జగదీశ్వరరావు పాల్గొన్నారు.తప్పిదాలు సరిదిద్దుకుంటాం: మహేశ్కుమార్గాంధీభవన్లో మహేశ్కుమార్గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఇటు తెలంగాణలో, అటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు రేవంత్ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి అద్దం పడుతుందన్నారు. తాము చెప్పినట్టుగా లోక్సభ ఎన్నికలను రెఫరెండంగానే భావిస్తున్నామని, గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ఈ లోక్సభ ఎన్నికల్లో తమకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, అంటే ప్రజల్లో తమపై విశ్వాసం పెరిగినట్టేనని చెప్పారు. తన కంటిని తన వేలుతో పొడుచుకున్నట్టు స్వయంకృతాపరాథంతో బీజేపీని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిపించారని, ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందంతోనే బీజేపీ 8 స్థానాల్లో గెలవగలిగిందని చెప్పారు. మోదీని ప్రజలు తిరస్కరించారు: వీహెచ్మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పదేళ్లలో ఏమీ చేయలేదని, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. ఇస్బార్ చార్సౌ పార్ అన్న మోదీని ప్రజలు తిరస్కరించారన్నారు. తుది విడత పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్పోల్స్ చూస్తే రాత్రి తనకు నిద్ర పట్టలేదని, గోడీ మీడియా ఎంత ఊదరగొట్టినా ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారని చెప్పారు. ఎంపీ అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ మోదీ గ్యారంటీ ఎక్స్పైరీ అయిందని, మోదీ ప్రధాని పదవికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
వికసించిన కమలం
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిచి బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి ఏపీలో చూసినా, తెలంగాణలో చూసినా ఇవే మెజారిటీ స్థానాలు. ఈ ఎన్నికల్లో కచి్చతంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని అటు అగ్రనేతలు మోదీ, అమిత్షా మొదలు రాష్ట్రనేతలు కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్ పేర్కొన్నా, రెండెంకెల సీట్లను మాత్రం సాధించలేకపోయింది. అయితే అధికార కాంగ్రెస్కు బీజేపీ గట్టి పోటీ ఇచి్చంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఎదుగుతుందనే ధీమాను ఆ పార్టీనేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించడంతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఎంపీగా గెలిచినట్టుగా రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.» 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీచేయగా, జి.కిషన్రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అరి్వంద్ ధర్మపురి (నిజామాబాద్), సోయం బాపూరావు (ఆదిలాబాద్)గెలిచారు. » 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 4 సిట్టింగ్ స్థానాలకు తోడు (ఆదిలాబాద్లో సోయం బాపూరావు స్థానంలో గోడెం నగే‹Ù), అదనంగా 4 చోట్ల ఈటల రాజేందర్(మల్కాజిగిరి), డీకే అరుణ (మహబూబ్నగర్), కొండా విశ్వేశ్వర్రెడ్డి (చేవెళ్ల), ఎం.రఘునందన్రావు (మెదక్) గెలిచారు. » 1980లో బీజేపీ ఏర్పడ్డాక...ఉమ్మడి ఏపీలో జరిగిన 1999 అసెంబ్లీ/లోక్సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో అత్యధికంగా 12 ఎమ్మెల్యే, 7 ఎంపీ సీట్లు (అందులో నాలుగు తెలంగాణ నుంచి) గెలుపొందారు. బీజేపీ గెలిచిన అత్యధిక సీట్లు అవే. » 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినా...ఇప్పుడు జరిగిన ఎంపీ ఎన్నికల్లో...ఒక్క తెలంగాణ నుంచే అత్యధికంగా 8 ఎంపీ సీట్లలో గెలిచి గత రికార్డులను బ్రేక్ చేసింది. » 1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండే రెండు సీట్లలో గెలుపొందింది. అందులో ఒకటి ఉమ్మడి ఏపీ హనుమకొండ స్థానం. ఇక్కడి నుంచి మాజీ కేంద్రమంత్రి పీవీ నరసింహారావును చందుపట్ల జంగారెడ్డి ఓడించారు. మరో స్థానంలో గుజరాత్లోని మెహసినా నుంచి ఏకే పాటిల్ గెలిచారు. » ఉమ్మడి ఏపీలో జరిగిన 1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేసి సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగరరావు, కాకినాడ నుంచి సినీనటుడు కష్ణంరాజు, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు గెలిచారు. » 1999 ఎన్నికల నాటికి టీడీపీ కలిసి బీజేపీ పోటీ చేయగా, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగరరావు, మెదక్ నుంచి ఆలె నరేంద్ర, మహబూబ్నగర్ నుంచి ఏపీ జితేందర్రెడ్డి, రాజమండ్రి నుంచి ఎస్బీపీబీకే సత్యనారాయణ, నరసాపురం నుంచి ఉప్పలపాటి కృష్ణంరాజు, తిరుపతి నుంచి వెంకటస్వామి గెలుపొందారు. తెలంగాణ వచ్చాక... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నో ఎగుడు దిగుళ్లను చవిచూసింది. » 2014 అసెంబ్లీ/లోక్సభ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసింది. 7% ఓట్లతో 5 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్లో బీజేపీ గెలుపొందింది. » 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకసీటు గెలిచి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యింది. ఆ ఎన్నికల్లో కేవలం ఏడుశాతం ఓటింగ్ సాధించింది. » 2019 లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 4 ఎంపీ సీట్లు గెలుపొంది గణనీయంగా 19 శాతం ఓటింగ్ను సాధించి బీజేపీ సత్తా చాటింది. వరుసగా బీజేపీ బలం పుంజుకోవడంతోపాటు అధికార బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తలపడి బీజేపీ అభ్యర్థులు ఎం.రఘునందన్రావు, ఈటల రాజేందర్ గెలుపొందారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం దగ్గర దాకా చేరుకొని 12 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి ఓటమి పాలయ్యారు. » 2020 డిసెంబర్లో జరిగిన జీహేచ్ఎంసీ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లు గెలుపొందడం ద్వారా బీజేపీ సంచలనం సష్టించింది. అంతకు ముందు ఆ పారీ్టకి నలుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉండగా ఏకంగా వారి సంఖ్య 48కు చేరుకుంది. » ఆ తర్వాత మొదటిసారిగా పార్టీ బీ ఫామ్పై టీచర్ ఎమ్మెల్సీ స్థానం (గతేడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో) నుంచి ఏవీఎన్రెడ్డి సంచలన విజయం సాధించారు. » 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో.14 శాతం ఓటింగ్తో 8 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించింది. » 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 35.08 శాతం ఓటింగ్తో 8 ఎంపీ సీట్లలో గెలుపొంది కాషాయ పార్టీ ఆధిక్యతను చాటింది. -
20 ఏళ్ల తర్వాత తొలిసారి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని రీతిలో పరాజయాన్ని చవి చూసింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యింది. 2004 లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ సరిగ్గా 20 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. 2004 ఎన్నికల్లో (14వ లోక్సభ) ఐదు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 స్థానాలు సాధించింది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు సాధించడం లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డింది. కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక పోయింది. చివరకు పార్టీకి పట్టు ఉన్న మెదక్ సెగ్మెంటు సహా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించిన మరో ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో సైతం పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బస్సుయాత్రతో 13 లోక్సభ సెగ్మెంట్లను చుట్టి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు సుడిగాలి ప్రచారం చేసినా ఎన్నికల ఫలితాలు పూర్తిగా నిరాశకే గురి చేశాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా పార్టీ పరాజయం పాలైంది. అసెంబ్లీ ఫలితాలతో అప్రమత్తమైనా..గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్టిలో పెట్టుకుని జనవరి మొదటి వారం నుంచే ఓటమిపై సమీక్ష పేరిట లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధతను ప్రారంభించింది. కేటీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశాల్లో కేడర్కు దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేఆర్ఎంబీకి కృష్ణా జలాల అప్పగింతను నిరసిస్తూ నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు.. కేసీఆర్ ఊతకర్ర సాయంతో (కేసీఆర్ ఇంట్లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే) హాజరయ్యారు. ఎండిన పంట పొలాల పరిశీలనకు పొలం బాట పేరిట ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో బస్సుయాత్ర చేశారు. మరోవైపు ‘చలో మేడిగడ్డ’ పేరిట కేటీఆర్, హరీశ్ల నేతృత్వంలో బీఆర్ఎస్ కీలకనేతలందరూ ప్రాజెక్టును సందర్శించారు. పార్టీ కేడర్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. మార్చి మొదటి వారం నుంచే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కేసీఆర్ దృష్టి పెట్టారు. అదే సమయంలో ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేసేందుకు మార్చి 12న ‘కరీంనగర్ కదనభేరి’ సభను నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయంలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.సిట్టింగ్ ఎంపీలు పార్టీకి దూరంలోక్సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్, కేటీఆర్ సెగ్మెంట్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరారు. 9 మంది సిట్టింగ్ ఎంపీలకు గాను కేవలం ముగ్గురు మాత్రమే తిరిగి లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేశారు. కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, మన్నె శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం) మాత్రమే తిరిగి పోటీ చేశారు. వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్కర్నూలు), బీబీ పాటిల్ (జహీరాబాద్), రంజిత్రెడ్డి (చేవెళ్ల), పసునూరు దయాకర్ (వరంగల్) బీఆర్ఎస్కు దూరమయ్యారు. పార్టీ టికెట్ ఖరారు చేసినా రంజిత్రెడ్డి, పి.రాములు, బీబీ పాటిల్ పార్టీకి దూరమవడం పార్టీ కేడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో పాటు రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్రెడ్డి, కోనప్ప, పట్నం మహేందర్రెడ్డి, సైదిరెడ్డి తదితరులు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వలస వెళ్లడం కూడా బీఆర్ఎస్పై ప్రభావం చూపింది. ఇలా బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన 9 మందికి బీజేపీ, కాంగ్రెస్లు ఎంపీ టికెట్లు ఇచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కవిత అరెస్టుతో విమర్శలుబీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై దృష్టి కేంద్రీకరించిన సమయంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయ్యారు. దీంతో బీఆర్ఎస్ తీవ్ర విమర్శ లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాయి. ఇక బస్సు యాత్ర కొనసా గుతున్న సమయంలోనే కేసీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించింది. సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. బస్సు యాత్రకు జనం స్పందన భారీగా రావడంతో లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపించినా చివరకు పూర్తిస్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు ఆశించిన రీతిలో రావడం లేదని రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు.మూడో స్థానంతో నిరాశకానీ బీఆర్ఎస్కు మాత్రం లోక్సభ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచిన పద్మా రావు గౌడ్, బాజిరెడ్డి గోవర్దన్ (నిజామాబాద్), ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ (నాగర్ కర్నూల్), పి.వెంకట్రామిరెడ్డి (మెదక్). ఆత్రం సక్కు (ఆదిలాబాద్) లాంటి నేతలు కూడా మూడో స్థానానికి పడిపోయారు. మహబూబాబాద్, ఖమ్మం మినహా అన్ని చోట్లా మూడో స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్, హైదరాబాద్లో 4వ స్థానంలో నిలిచింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మాలోతు కవిత (మహబూబాబాద్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం)లు మాత్రమే రెండో స్థానంలో ఉండి కొంత పోటీ ఇవ్వగలిగారు. గత ఫలితాలతో పోలిస్తే 3 స్థానాలున్న కాంగ్రెస్ బలం 8 స్థానాలకు పెరగ్గా, గతంలో 4 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. ఇక, పోటీ చేసిన 17 స్థానాల్లో 8 చోట్ల గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ, 8 చోట్ల రెండో స్థానంలో, ఒక్కచోట మాత్రం మూడోస్థానంలో నిలిచింది. -
Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్కు చెరో '8'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. ఓడినవారిలో నామా నాగేశ్వర్రావు, మాలోతు కవిత, రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, బీబీ పాటిల్ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్రెడ్డి, బండి సంజయ్, అరవింద్ మాత్రమే తమ సీట్లను నిలుపుకొన్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పట్టు.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్సభ సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. పట్టుపెంచుకున్న ఇరు పార్టీలు.. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ.. ఈసారి తన బలాన్ని 8 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్ కూడా 3 సీట్ల నుంర్టీచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. ఆ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలే గెలిచిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి సమ ఉజ్జీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఒక్క లోక్సభ సీటు గెలవలేదు. గత, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివీ.. పార్టీ 2014 2019 2024 కాంగ్రెస్ 2 3 8 బీజేపీ 1 4 8 ఎంఐఎం 1 1 1 బీఆర్ఎస్ 11 9 0 నల్లగొండ: రికార్డు స్థాయి మెజారిటీ నల్లగొండ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకొంది. కౌంటింగ్ ఆద్యంతం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపారు. చివరికి ఏకంగా రికార్డు స్థాయిలో 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి: అంతా తొలిసారి ఎంపీలే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తమకు ఉన్న పట్టును కాంగ్రెస్ పార్టీ మరోసారి నిలుపుకొంది. భువనగిరి లోక్సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్పై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిరణ్కుమార్రెడ్డి తొలిసారి లోక్సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సెగ్మెంట్లో ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా తొలిసారిగా ఎంపీలు అయినవారే కావడం విశేషం. నాగర్ కర్నూల్: మళ్లీ ‘చేతి’కి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్పై గెలుపొందారు. మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలవడం గమనార్హం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. పెద్దపల్లి: మళ్లీ కాంగ్రెస్ ఖాతాలోకి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్పై విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) మనవడు, చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ తనయుడే గడ్డం వంశీకృష్ణ. ఈయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. వరంగల్: పార్టీ మారి పోటీచేసినా.. 2009లో జరిగిన పునర్విభజనలో వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ గెలవగా తర్వాత వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్పై 2,20,339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అరూరి రమేష్ కూడా ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి పోటీ చేయడం గమనార్హం. మహబూబాబాద్: సెగ్మెంట్ చరిత్రలో అధిక మెజారిటీ మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాంనాయక్ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు. 1957 నుంచీ కొనసాగిన మానుకోట పాత పార్లమెంట్ స్థానంలోగానీ, 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలోగానీ.. ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ తరఫున ఇదే లోక్సభ స్థానం నుంచి గెలిచిన బలరాంనాయక్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. ఈసారి మళ్లీ గెలిచారు. ఖమ్మం: ఆద్యంతం కాంగ్రెస్ ఆధిక్యమే.. తొలి రౌండ్ నుంచి చివరిదాకా కాంగ్రెస్ ఆధిక్యమే కొనసాగింది. చివరికి 4,67,847 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 18 ఎన్నికల్లో.. ప్రస్తుతం రామసహాయం రఘురాంరెడ్డి సాధించిన మెజారిటీయే రికార్డు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 20,488 ఓట్లే రాగా.. ఈసారి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు 1,18,636 ఓట్లు సాధించారు. జహీరాబాద్: ఇక్కడా హస్తం హవా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జహీరాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్పై విజయం సాధించారు. సురేశ్ షెట్కార్ ఇదే సెగ్మెంట్ నుంచి 2009లో ఎంపీగా గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన బీబీ పాటిల్ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ మూడో స్థానంలో నిలిచారు. నిజామాబాద్: పోటాపోటీ మధ్య కమలానికి.. ఇందూరు గడ్డపై మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగిన నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను.. అరవింద్కు బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్ రూరల్లలో ఆధిక్యత వచ్చింది. జీవన్రెడ్డికి జగిత్యాల, నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది. కరీంనగర్: పట్టు పెంచుకున్న జాతీయ పార్టీలు తొలి నుంచీ బీఆర్ఎస్కు ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్ లోక్సభ స్థానంలో జాతీయ పార్టీలు పట్టుపెంచుకున్నాయి. ఇక్కడ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 4,98,276 ఓట్లు, బీఆర్ఎస్కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్కు 1,79,258 ఓట్లు రాగా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. క్రితంసారితో పోలిస్తే 86,840 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు 3,59,907 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్కు 1,80,649 ఓట్లు అదనంగా వచ్చాయి. ఈసారి బీఆర్ఎస్కు 2,82,163 ఓట్లు వచ్చాయి. 1.25 లక్షలకుపైగా ఓట్లు తగ్గాయి. మహబూబ్నగర్: కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి డీకే అరుణ 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన డీకే అరుణ లోక్సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఈ లోక్సభ ఎన్నికలో సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి: దేశంలోనే పెద్ద సెగ్మెంట్.. తొలిసారి బీజేపీ విజయం దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్సభ సెగ్మెంట్ మల్కాజిగిరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్లో ప్రముఖ నేతగా కొనసాగి, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈటల తొలిసారి ఎంపీ అయ్యారు. చేవెళ్ల: కొండా వశం చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన 2014లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల సెగ్మెంట్లో ఏకంగా 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మెదక్: గులాబీ కంచుకోటలో కమలం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉన్న మెదక్లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్పై గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే సుమారు 35 వేల ఓట్లు తక్కువగా వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆదిలాబాద్: మళ్లీ కమలమే! ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కమలం పార్టీ మళ్లీ వికసించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కౌంటింగ్ తొలుత ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నా.. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. చివరికి నగేశ్ గెలిచారు. హైదరాబాద్: ఐదోసారి లోక్సభకు అసదుద్దీన్ హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో తన ప్రచార, వ్యవహార శైలితో జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన మాధవీలత ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయ్యారు. 2019లో 2.82 లక్షల ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్ గెలవగా.. మెజారిటీ మరో 50వేలకుపైగా పెరిగింది. సికింద్రాబాద్: ఓట్లు మరింత పెంచుకున్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో బీజేపీ తన ఓట్లశాతాన్ని మరింత పెంచుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్లో బీజేపీకి 42.05 శాతం ఓట్లురాగా.. ఈసారి 45.15శాతం వచ్చాయి. -
బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు బదిలీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఓటింగ్ శాతాన్ని బీజేపీ గణనీయంగా 35.08 శాతానికి పెంచుకుంది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓటింగ్తో 8 ఎమ్మెల్యే సీట్లలో గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 21.08 ఓటింగ్ శాతం పెంచుకొని మొత్తంగా 35.08 శాతాన్ని సాధించడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలు అప్పటి అధికారపార్టీ బీఆర్ఎస్– ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల మధ్య సాగడంతో బీజేపీ మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశంలో జాతీయ రాజకీయాలకు ఏర్పడిన ప్రాధాన్యత, మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారనే అంచనాల మధ్య లోక్సభ ఎన్నికలు జరిగాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, రాహుల్గాంధీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాల మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో... తెలంగాణలో ప్రధానంగా జాతీయపార్టీలైన బీజేపీ–కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోటీ ఏర్పడడంతో భారత రా్రïÙ్టయ సమితి (బీఆర్ఎస్) మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జాతీయ రాజకీయాలకు ఏర్పడిన ప్రాధాన్యం దృష్ట్యా పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి బదిలీ అయ్యిందనే అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో స్వతాహాగా బీజేపీ ఓటింగ్ శాతం పెరగడంతో పాటు, బీఆర్ఎస్ ఓట్లు కొంత మేర బీజేపీకి పడడంతో ఒక్కసారిగా ఓటింగ్శాతం 35.08 శాతానికి చేరుకుందని లెక్కలు కడుతున్నారు. 2.02 % ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓటమిరాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39.4 శాతం ఓట్లను సాధించి అగ్రస్థానంలో నిలవగా, బీఆర్ఎస్ పార్టీ 37.35శాతం ఓట్లను సాధించింది. బీఆర్ఎస్తో పోల్చితే కేవలం 2.05 శాతం ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం. బీజేపీ 13.9శాతం, ఎంఐఎం 2.22 శాతం, బీఎస్పీ 1.37శాతం ఓట్లను దక్కించుకున్నాయి. ఎన్నికల్లో పోలై న మొత్తం 2,32,59,256 ఓట్లలో కాంగ్రెస్ 92,35,792, బీఆర్ఎస్ 87,53,924, బీజేపీ 32,57,511, ఎంఐఎం 5,19,379 ఓట్లను సాధించాయి. -
ఆ రెండింటా ఓటమి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలనిచ్చి నా, వ్యక్తిగతంగా సీఎం రేవంత్రెడ్డికి మాత్రం నిరాశను మిగిల్చాయి. సీఎం హోదాలో ఉన్న రేవంత్ సొంత లోక్సభ నియోజకవర్గమైన మహబూబ్నగర్లోనూ, సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. పాలమూరులో గెలుపు కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డినా స్వల్ప తేడాతో పార్టీ అభ్యర్థి వంశీచందర్రెడ్డి ఓడిపోవడం, సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఏకంగా దాదాపు 4లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలాసార్లు మహబూబ్నగర్కు వెళ్లిన రేవంత్రెడ్డి మాట్లాడుతూ సొంత స్థానంలో తనను ఓడించి రాజకీయంగా బలహీనపర్చేందుకు కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. వంశీని గెలిపించేందుకు పలు హామీలనిస్తూ కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల లాంటి పథకాలను ప్రకటించారు. అయినా ఫలితం లేకపోవడంతో రేవంత్ శిబిరం ఒకింత నైరాశ్యంలో మునిగిపోయింది. అయితే, ఈ స్థానం నుంచి గెలుపు కాంగ్రెస్, బీజేపీల మధ్య దోబూచులాడడం, బీజేపీ అభ్యర్థి డీకే.అరుణకు గట్టిపోటీ ఇస్తూ చాలా తక్కువ తేడాతో ఓడిపోవడం మాత్రం కొంత ఊరట కలిగించింది. ఇక, మల్కాజ్గిరిలో భారీ ఓటమి కూడా రేవంత్ శిబిరానికి మింగుడుపడని విషయమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన స్థానంలో, తాను కోరి తెచ్చిన అభ్యర్థి దాదాపు 4లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం కాంగ్రెస్ అధిష్టానం వద్ద రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ను ఎంతోకొంత నష్టపరుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన నల్లగొండ, భువనగిరిల్లో మళ్లీ ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. నల్లగొండలో 5.5లక్షలు, భువనగిరిలో 2.1లక్షల ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులను చిత్తు చేసిన కాంగ్రెస్ ఆ రెండు సిట్టింగ్ స్థానాలనూ నిలబెట్టుకోవడం గమనార్హం. -
అసెంబ్లీకి భిన్నంగా లోక్సభ తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జాతీయ రాజకీయ మార్పులకు అనుగుణంగా తెలంగాణ ఓటరు నాడి కనిపిస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచి్చన తీర్పుకు భిన్నంగా తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీలను గెలిపించి రాష్ట్ర ఓటర్లు తమ విలక్షణమైన తీరును మరోసారి చాటుకున్నారు. 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం పోలయిన ఓట్లలో కాంగ్రెస్కు 39.40 శాతం వాటా ఇచ్చి 64 సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించిన ఓటర్లు..ఈసారి దానికి అదనంగా స్వల్ప ఆధిక్యతను కట్టబెట్టారు. మొత్తం పోలయిన ఓట్లలో అత్యధికంగా 87,41,263 ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ .. 40.10 శాతం ఓట్లతో రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లకు గాను 8 చోట్ల విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 18 శాతం ఓట్లు మాత్రమే దక్కించుకొని మూడు సీట్లకు పరిమితమైన కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా దాదాపు 40 శాతం ఓట్లు సాధించింది. గణనీయంగా పెరిగిన బీజేపీ ఓటు షేర్ కాంగ్రెస్తో సమానంగా రాష్ట్రంలో 8 లోక్సభ సీట్లు గెలుచుకున్నప్పటికీ బీజేపీకి కాంగ్రెస్ కన్నా సుమారు 11 లక్షల ఓట్లు తక్కువ పోలయ్యాయి. అయితే కాంగ్రెస్ తర్వాత మొత్తం 76,47,424 ఓట్లను పొందడం ద్వారా 35.08 శాతం వాటాను కైవసం చేసుకుంది. బీజేపీకి గత నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం 14 శాతం ఓట్లు మాత్రమే రాగా, ఆరు నెలల్లో అది 35 శాతానికి పెరగడం గమనార్హం. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 22 శాతం ఓట్లు సాధించింది. ఆరునెలల్లో అనూహ్యంగా.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బాగా దెబ్బతిన్న పారీ్టగా బీఆర్ఎస్ నిలిచింది. ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 37.35 శాతం ఓట్లతో 39 సీట్లు సాధించి కాంగ్రెస్ తరువాత రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో బాగా వెనుకబడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 52 శాతం ఓట్లు సాధించి 9 సీట్లను గెలుచుకున్న ఈ పార్టీ ఈసారి ఒక్క సీటును కూడా సాధించలేదు. 16.68 శాతం ఓట్లతో (36,37,086) బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. అయితే గత లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఏకంగా 36 శాతం ఓట్లు ఆ పార్టీ కోల్పోయింది. జాతీయ స్థాయిలో ప్రధానిని నిర్ణయించే లోక్సభ ఎన్నికల్లో ఈసారి జాతీయ పారీ్టలైన బీజేపీ, కాంగ్రెస్ల వైపు తెలంగాణ ఓటర్లు మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. ఇక హైదరాబాద్లో గెలిచిన ఎంఐఎం ఎప్పటిలాగే 3 శాతం ఓట్లను సాధించింది. నోటాకు గణనీయంగా 8,50,177 (3.9 శాతం) ఓట్లు పోలయ్యాయి. -
ఫలించిన ‘ఉత్తమ్’ వ్యూహం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా గెలిచిన నియోజకవర్గాల్లో రెండో అతి పెద్ద మెజార్టీని కైవసం చేసుకుని నల్లగొండ లోక్సభ స్థానం రికార్డు సృష్టించింది.అసోంలోని ధుబ్రీ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హసన్కు 9.8 లక్షలకు పైగా మెజార్టీ రాగా, ఆ తర్వాత కేరళలోని తిరువల్లూర్లో శశికాంత్ సెంథిల్ 5.7 లక్షల మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నల్లగొండలోనే రఘువీర్రెడ్డి 5.59 లక్షల అత్యధిక మెజార్టీ సాధించగలిగారు. పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నికల ఇన్చార్జి గా వ్యవహరించిన ఉత్తమ్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక వ్యూ హం రచించారు. రఘువీర్రెడ్డిని అభ్యరి్థగా ప్రకటించినప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి కేంద్రీకరించారు. దాదాపు నెలరోజులకు పైగా నియోజకవర్గంలోనే పనిచేసి కేడర్ను కదిలించగలిగారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, పార్టీ మండల, గ్రామ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో గెలుపు వ్యూహాన్ని అమలు చేశారు. ఎక్కడికక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మిగతా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్తో పాటు తన సతీమణి పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ నియోజకవర్గం నుంచి మెజారిటీ ఓట్లు వచ్చేలా ఉత్తమ్ కసరత్తు చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఆ రెండు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో రఘువీర్కు అత్యధికంగా ఓట్లు లభించాయి. కోదాడ నియోజక వర్గంలో కాంగ్రెస్కు 1,25,472 ఓట్లు రాగా, హుజూర్నగర్లో 1,33,198 ఓట్లు వచ్చాయి. పోలైన మొత్తం ఓట్లలో 33.50 శాతం ఓట్లు ఈ రెండు నియోజకవర్గాల్లోనే లభించడం విశేషం. దేవరకొండ, మిర్యాలగూడ, సాగర్, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాలను మించి ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఓట్లు వచ్చాయి. హుజూర్నగర్లో 1.05 లక్షలు, కోదాడలో 95 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ లభించింది. హుజూర్నగర్లో వచ్చిన మెజార్టీ రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ పరిధిలోనూ రాకపోగా, దేశంలోని టాప్–5 స్థానాల్లోనూ హుజూర్నగర్ ఉంటుందని టీపీసీసీ అంచనా వేస్తోంది. అత్యధిక మెజార్టీపై ఉత్తమ్ హర్షం హుజూర్నగర్: నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి దాదాపు 5.50 లక్షలకు పైగా మెజార్టీ తో విజయం సాధించడంపై ఉత్తమ్కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1.05 లక్షల మెజార్టీ , తన సతీమణి పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 95 వేల మెజార్టీ ని ప్రజలు కాంగ్రెస్ అభ్యరి్థకి ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీ ఇచి్చన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
రఘువీర్రెడ్డి రికార్డు మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ రికార్డు నమోదైంది. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డికి 7,84,337 ఓట్లురాగా.. సమీప బీజే పీ అభ్యర్థి సైదిరెడ్డికి 2,24,431 ఓట్లు వచ్చాయి. అంటే రఘువీర్రెడ్డి 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ. ఇంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు 3,97,029 ఓట్ల మెజారిటీ లభించింది. అయి తే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ గెలిచిన ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక అదే ఎన్నికల్లో వరంగల్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి (బీఆర్ఎస్) 3,92,574 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా విజ యం సాధించిన పసునూరి దయాకర్కు 3,50,298 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ రఘువీర్రెడ్డి భారీ మెజారిటీ సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ.. ఉమ్మడి రాష్ట్రంలో పరిశీలిస్తే.. అత్యధిక మెజారిటీ మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నర్సింహారావు పేరిట ఉంది. 1991 లోక్సభ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుంచి పోటీచేసి 5,80,297 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత 2011 కడప లోక్సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 5,45,672 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. -
కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలుపు
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. శ్రీగణేశ్ విజయం సాధించారు. సమీప ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్పై 13,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత నెల 13న జరిగిన ఉపఎన్నికలో 1,30,929 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. శ్రీగణేశ్ 53,651 ఓట్లు దక్కించుకొని విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్ 40,445 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి జి. నివేదిత కేవలం 34,462 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు. గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. లాస్య నందిత స్థానంలో ఆమె అక్క నివేదితకు బీఆర్ఎస్కు టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్, కాంగ్రెస్లో చేరి పార్టీ టికెట్ దక్కించుకున్నారు. 3.. 2.. 1 : తొలినాళ్లలో కాంగ్రెస్ యువనేతగా రాజకీయాల్లోకి వచి్చన నారాయణన్ శ్రీగణేశ్, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం శ్రీగణేశ్ ఫౌండేషన్ స్థాపించి కంటోన్మెంట్లో తన సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలో మరోసారి కాంగ్రెస్ టికెట్ కోసం యతి్నంచినా, దక్కలేదు. ఆఖరి నిమిషంలో బీజేపీ టికెట్ కేటాయించడంతో పోటీ చేసి 15వేల పైచిలుకు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ తరఫున పోటీ చేసి 41,888 ఓట్లతో రెండోస్థానం దక్కించుకున్నారు. ఉపఎన్నిక రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శ్రీగణేశ్ సొంతగూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి ఎట్టలకేలకు విజయం అందుకున్నారు. దీంతో శ్రీగణేశ్ను 3.. 2.. 1గా ఆయన అభిమానులు అభివర్ణిస్తూ ఉండటం గమనార్హం. రేవంత్ను కలిసిన శ్రీగణేశ్: ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీగణేశ్ సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. మంగళవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనను అభినందించారు. అసెంబ్లీలో కాంగ్రెస్కు పెరిగిన బలం సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ బలం పెరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం మరింత తగ్గినట్లయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసిన శ్రీగణేశ్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్పై 13 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నందిత సోదరి నివేదిత మూడోస్థానానికి పరిమితమయ్యారు. కాగా, కంటోన్మెంట్లో విజయంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరగ్గా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ఆ సంఖ్య 68కి చేరింది. మిత్రపక్షం సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం. కంటోన్మెంట్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం, ముగ్గురు ఎమ్మెల్యేల ఫిరాయింపుతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 39 నుంచి 35కి తగ్గింది. -
ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీపై కాంగ్రెస్ విష ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదని, రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మలేదని, పొత్తు లేకుండా సొంతంగా పోటీచేసి తెలంగాణలో 8 స్థానాలు సాధించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఆరు నెలలుగా బీఆర్ఎస్ సర్కార్ చేసినట్టే చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఒక ఆశాదీపంగా బీజేపీ కనిపించిందన్నారు. పార్లమెంట్ ఫలితాలు వెలువడ్డాక మంగళవారం రాత్రి పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల గొంతుకగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ధీమాను వ్యక్తంచేశారు. ‘బీజేపీని ప్రజలు ఆశీర్వదించారు. మోదీ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచారు. మేము ఓటమి పొందిన సీట్లలో కూడా మా పారీ్టకి గతంకన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి’అన్నారు. ‘బీఆర్ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ పార్టీ కంచుకోట మెదక్లో కూడా బీజేపీ జెండా ఎగురవేసింది’అని చెప్పారు. ‘ఈ ఎన్నికలు రెఫరెండం అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.. 50 శాతం సీట్లు కూడా రాలేదు... ప్రజలకు ఇప్పుడు ఏం చెబుతారు’అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఆదరించిన ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీని మరింత బలోపేతం చేస్తాం.. సికింద్రాబాద్: రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని కిషన్రెడ్డి ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి రెండోసారి విజయం సాధించిన కిషన్రెడ్డి మంగళవారం సాయంత్రం ఓయూలోని కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం గొప్ప పరిణామమని, ఇంకొన్ని సీట్లు గెలవాల్సి ఉన్నప్పటికీ విపక్షాల ఒత్తిళ్ల కారణంతో చేజారాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర పారీ్టపైనే ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. -
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
కరీంనగర్టౌన్: ‘బండి సంజయ్ గలీజోడు.. ముస్లింలంతా ఏకమై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిచి్చండు. ఏమైంది? అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అడ్రస్సే గల్లంతు చేశారు’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం సంజయ్ కరీంనగర్లోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లి రిటరి్నంగ్ అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను ఓడించేందుకు ఒకవర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని, కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం గతం కన్నా ఎక్కువ నిధులు తీసుకొస్తానని, మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లేముందు, ఆ తర్వాత గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఇంటికి చేరుకుని సంజయ్ తన తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆయన గెలుపు సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. కుటుంబ సభ్యులతో కలసి సంజయ్ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. -
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్ మొత్తానికి ఫలించింది. 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్ టాపిక్గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు. -
మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం
మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింంది. గత ఎన్నికల్లో స్థానంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. -
మహబూబ్నగర్: హోరా హోరీ లెక్కింపులో డీకే అరుణ విజయం
మహబూబ్నగర్: హోరా హోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇక్కడ గెలుపునకు సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకుని చల్లా వంశీచంద్రెడ్డిని కాంగ్రెస్ తరఫున బరిలో దించారు. అయితే లెక్కింపు సమయంలో డీకే. అరుణ, వంశీచంద్ మధ్య విజయం దోబూచులాడింది. ఈవీఎం లెక్కింపుల్లో ఆమె కేవలం 1800 ఓట్ల ముందంజలో ఉన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 8000 లెక్కింపునకు ఉండేసరికి బీజేపీ శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు హోరాహోరీగా సాగిన లెక్కింపులో 3636 ఓట్ల మెజార్టీతో డీకే అరుణను విజయం వరించింది.