అనంతపురం జిల్లాలో రెయిన్ గన్స్ పెట్టినా పంటలను రక్షించలేకపోయామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
రెయిన్ గన్స్ పెట్టినా పంటలను రక్షించలేకపోయాం
Jan 9 2017 8:02 PM | Updated on Jul 12 2019 6:01 PM
అమరావతి: అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రెయిన్ గన్స్ పెట్టినా పంటలను రక్షించలేకపోయామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ఏడాదికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్పై మంత్రి కసరత్తు ప్రారంభించారు.
సోమవారం ఆర్థిక, వ్యవసాయ రంగ ప్రముఖులతో మంత్రి సమావేశమయ్యారు. వ్యవసాయంపై నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. వర్షాభావ, కరువు ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement