‘సీఎం మమ్మల్ని కలవడం లేదు’ | waited to meet CM but he did not meet us: MK Stalin | Sakshi
Sakshi News home page

‘సీఎం మమ్మల్ని కలవడం లేదు’

Apr 19 2017 2:19 PM | Updated on Jun 4 2019 5:16 PM

సీఎం పళనిస్వామిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ తమను ఆయన కలవడం లేదని స్టాలిన్‌ ఆరోపించారు.

చెన్నై: తక్షణమే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావును కోరినట్టు తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ తెలిపారు. బుధవారం తమ పార్టీ నాయకులతో పాటు గవర్నర్‌ ను ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.

రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని కూడా కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ తమను ఆయన కలవడం లేదని స్టాలిన్‌ ఆరోపించారు. రైతులకు మద్దతుగా ఈ నెల 25 రాష్ట్ర బంద్‌ కు అంతకుముందు ఆయన పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement