తమిళనాడులో మరోసారి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కలకలం రేగింది.
చెన్నై: తమిళనాడులో మరోసారి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కలకలం రేగింది. చెన్నై బర్మాబజార్కు చెందిన ఓ వ్యక్తిని రాజస్థాన్ ఐటీఎస్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్ధ సానుభూతిపరులకు నిధులు ఇస్తూ సహకరిస్తున్న నేపథ్యంలో ఏటీఎస్ అధికారులు పక్కా పథకం వేసి, హరూన్ను అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం అతడిని జైపూర్ తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.