ప్రముఖులకు జయ దర్శనం కరువు | Jaya eminent exponent of drought | Sakshi
Sakshi News home page

ప్రముఖులకు జయ దర్శనం కరువు

Oct 9 2014 3:08 AM | Updated on Oct 9 2018 3:01 PM

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను దర్శించుకోవడానికి వచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను దర్శించుకోవడానికి వచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. బుధవారం వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సెలవు కావడంతో సందర్శకులను లోనికి అనుమతించలేదు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే విషయమై జయతో చర్చించడానికి వచ్చిన తమిళనాడు అడ్వొకేట్ జనరల్ నవనీత్ కృష్ణన్‌కు కూడా జయ దర్శన భాగ్యం లభించలేదు. పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ, లోనికి అనుమతించక పోవడంతో వెనుదిరిగారు. కాగా జయలలిత ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎప్పటిలాగే ఆపిల్, పాలు, పెరుగన్నం ఆరగించారని జైలు సూపరిండెంట్ జయసింహ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement